Arvind Kejriwal: కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విందు భేటీ విఫలమైంది. గత శనివారం ఆయన ఏర్పాటుచేసిన విందు సమావేశానికీ పిలిచిన వారిలో ఒక్క ముఖ్యమంత్రీ హాజరు కాలేదు.

Published : 21 Mar 2023 09:51 IST

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విందు భేటీ విఫలమైంది. గత శనివారం ఆయన ఏర్పాటుచేసిన విందు సమావేశానికీ పిలిచిన వారిలో ఒక్క ముఖ్యమంత్రీ హాజరు కాలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కేజ్రీవాల్‌కు మింగుడుపడనిదే. 2024 లోక్‌సభ ఎన్నికల కూటమిపై చర్చించేందుకు రావాలని ఆయన భాజపాయేతర, కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏడుగురికి లేఖలు రాశారు.  ‘ప్రొగ్రెసివ్‌ చీఫ్‌ మినిస్టర్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండియా (జీ8) పేరుతో ఆయన ఈ విందు భేటీ నిర్వహించాలనుకున్నారు. ఇందులో భాగంగా ఏడుగురు ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. తనతోపాటు మొత్తం 8 మంది భేటీ అవ్వాలనేది కేజ్రీవాల్‌ ఆలోచనని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని