సమయమొచ్చినప్పుడు ప్రజలే సమాధానమిస్తారు
అవినీతికర భాజపా ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, సమయమొచ్చినప్పుడు ప్రజలే సరైన సమాధానమిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
ప్రియాంకా గాంధీ వ్యాఖ్య
దిల్లీ: అవినీతికర భాజపా ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, సమయమొచ్చినప్పుడు ప్రజలే సరైన సమాధానమిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. దిల్లీ పోలీసులు తన సోదరుడు రాహుల్ గాంధీ ఇంటికి రావడంపై ఆమె ట్విటర్లో స్పందించారు. ‘మహిళల తరఫున ఎందుకు మాట్లాడుతున్నారని రాహుల్కు పోలీసులు నోటీసు ఇచ్చారు. ఆయనే కాదు.. దళితులు, గిరిజనులు, పేదలు, రైతులు, యువత భాజపా ప్రభుత్వ వేధింపులను ఎదుర్కొంటున్నారు. 38 షెల్ కంపెనీలను పెట్టిన అదానీకి మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వరు’ అని ఆమె విమర్శించారు. ఉత్తర్ప్రదేశ్లో ఈవ్ టీజింగ్కు విద్యార్థిని బలైన సంఘటన భాజపా ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోందని మరో ట్వీట్లో ధ్వజమెత్తారు.
రాహుల్కు ఒమర్ అబ్దుల్లా మద్దతు
జమ్ము: మహిళలు ఇంకా వేధింపులకు గురవుతున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో తప్పేముందని, దానికే నోటీసులిస్తారా అని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘ఇది దేశంలో నిత్యం ఏదో ఒకచోట జరగడం నిజం కాదా? ఆ విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పడంలో కొత్తేముంది. ఏ పత్రిక తిరగేసినా ఎక్కడో ఒకచోట అత్యాచార వార్తలు కనిపిస్తూనే ఉంటాయి కదా’ అని పేర్కొన్నారు. ఆయన కశ్మీర్ ఒక్కదాని గురించే మాట్లాడలేదని, పాదయాత్ర సందర్భంగా దేశంలోని పరిస్థితిని తనతో ప్రస్తావించారని సోమవారమిక్కడ ఆయన తెలిపారు.
భాజపాలో చేరిన వైకాపా మైనార్టీ సంఘ నేత చాంద్బాషా
ఈనాడు, అమరావతి: వైకాపా మైనార్టీ సంఘం నాయకుడు షేక్ చాంద్బాషా భాజపాలో చేరారు. విజయవాడలోని భాజపా కార్యాలయంలో సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గతంలో గుంటూరులో మున్సిపల్ కౌన్సిలర్గా, పీసీసీ కార్యదర్శిగా, మైనార్టీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ప్రస్తుతం వైకాపా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామాచేసి, భాజపాలో చేరారు. ఈ మేరకు రాష్ట్ర భాజపా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
తెదేపా ఎమ్మెల్యేలపై దాడిని ఖండిస్తున్నాం: సీపీఐ
ఈనాడు, అమరావతి: శాసనసభలో తెదేపా సభ్యులపై వైకాపా ఎమ్మెల్యేల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ‘‘ప్రజాస్వామిక వ్యవస్థకు పట్టుగొమ్మగా ఉండాల్సిన శాసనసభ దాడులకు వేదిక కావడం విచారకరం. ప్రజాసమస్యలపై పరిష్కారానికి చర్చల ద్వారా కృషిచేయాల్సిన అధికార పార్టీ శాసనసభ్యులు.. ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్యేలపై భౌతిక దాడులకు తెగబడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదొక దురదృష్టకరమైన రోజు. ఇంత జరిగినా సీఎం జగన్ స్పందించకపోవడం తగదు’’ అని వెల్లడించారు.
అరాచక.. గూండా పాలన: సీపీఎం
ఈనాడు, అమరావతి: శాసనసభలో తెదేపా ఎమ్మెల్యేలపై వైకాపా ఎమ్మెల్యేల దాడిని చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనిపిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. జీవో-1కు వ్యతిరేకంగా చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జీవో-1పై అడిగితే కొట్టడడమేంటి? ఇది అరాచక, గూండా పాలన. దీనికి స్వస్తి చెప్పకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసన కొత్తకాదు. భగత్సింగ్ పార్లమెంటులో పేపర్లు విసిరేశారు. వైకాపా ప్రభుత్వానికి పతనం దగ్గర పడిందని హెచ్చరించారు. ధర్నాచౌక్లో ఆందోళనలకు అనుమతించడం లేదు. శ్మశాన కార్మికులు తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు వస్తే అరెస్టుచేశారు. రాష్ట్రాన్నే జైలుగా మార్చేశారు. ఈ జైల్లోనే ప్రజలు వైకాపాకు సమాధి కడతారు. సీఎం జగన్ సభకు పిల్లలను తరలించి, వారికి ఆహారం పెట్టలేదు. సీఎంకు ఒక నిబంధన, ప్రతిపక్షాలకు ఒక నిబంధనా? పౌరహక్కుల కోసం పోరాడేందుకు ఎవ్వరి అనుమతీ అవసరం లేదు’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. సీపీఎం మద్దతు కోరింది. -
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
ఒక్క డీఎస్సీ కూడా పెట్టకుండా జగన్.. యువత భవిష్యత్తు నాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందని, రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!