Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!
‘అడిగిన ప్రశ్న ఏంటి? మీరు చెప్పే సమాధానం ఏమిటి? మీరు చెప్పిన సమాధానానికి ఉపాధ్యాయుడిగా 10కి కనీసం 2 మార్కులు కూడా నేను వేయలేను’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం విరుచుకుపడ్డారు.
పీడీఎఫ్ ఎమ్మెల్సీల ప్రశ్నల పరంపర
సమాధానం చెప్పలేక ఇబ్బంది పడిన మంత్రి బొత్స
డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీపై కొరవడిన స్పష్టత
ఈనాడు, అమరావతి: ‘అడిగిన ప్రశ్న ఏంటి? మీరు చెప్పే సమాధానం ఏమిటి? మీరు చెప్పిన సమాధానానికి ఉపాధ్యాయుడిగా 10కి కనీసం 2 మార్కులు కూడా నేను వేయలేను’ అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం విరుచుకుపడ్డారు. శాసన మండలిని తప్పుదోవ పట్టించేలా మంత్రి ప్రశ్నకు పొసగని సమాధానం ఇచ్చారని విమర్శించారు. ‘సభలో అడిగిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం రాదు..వచ్చినా సరైన సమాచారం ఇవ్వరన్న అభిప్రాయాన్ని కలిగించవద్దు’ అని ఆయన మంత్రికి సూచించారు. సభలో ఈ చర్చకు దారితీసిన పరిస్థితులు ఇవి.
‘2019 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీల వివరాలు తెలపండి? నియమించిన ఉపాధ్యాయుల సంఖ్య చెప్పండి? ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు కొత్త డీఎస్సీని ప్రకటించేందుకు ప్రభుత్వం దగ్గర ఏమైనా ప్రతిపాదన ఉందా’ అని తెదేపా, పీడీఎఫ్ సభ్యులు శాసనమండలిలో ప్రశ్నించారు. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానమిస్తూ.. ‘2019లో డీఎస్సీ ద్వారా 14,219 పోస్టులను భర్తీ చేశాం. 2018, 1998లలో నిర్వహించిన డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులకు పోస్టింగ్లు ఇస్తున్నాం. ఇంకా 771 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల ఖాళీలు రాలేదు. శాంక్షన్ పోస్టులను ఎక్కడా రద్దు చేయలేదు’ అని చెప్పారు. మంత్రి ఇచ్చిన ఈ సమాధానంపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం తీవ్రంగా స్పందించారు. ‘సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి? మంత్రి ఇచ్చిన సమాధానం ఏంటి? ఈ ప్రశ్నకు విద్యార్థి ఎవరైనా ఇదే జవాబు రాస్తే.. 10కి 2 మార్కులు కూడా నేను ఇవ్వను. ఉపాధ్యాయుడిని కాబట్టి ఇలా చెబుతున్నా. ఎప్పుడో చేసిన నియామకాల గురించి చెప్పడం ఏంటి? కొత్త డీఎస్సీ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా..లేదా అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఎక్కడ సమాధానం చెప్పారు. సహజంగా మీరు చెప్పే మాటలు ‘‘ఉంది’’..‘‘లేదు’’..‘‘ఉత్పన్నం కాదు’’ అనే పదాల్లో ఏదో ఒకటి చెప్పండి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాట్సప్ గ్రూపులో పెడితే.. ఆశ్చర్య పోతారు
‘సభలో అడిగిన ప్రశ్న.. మీరు చెప్పిన సమాధానం.. రెండింటినీ ఫొటో తీసి ఉపాధ్యాయుల వాట్సప్ గ్రూప్లో పెడతా. విద్యా శాఖ ఇలాంటి సమాధానం చెప్పిందా అని ఆశ్చర్యపోతారు. రేపటి నుంచి ఉపాధ్యాయులు కూడా ఇదే పద్ధతిలో విద్యార్థులకు పాఠాలు చెప్పాలనుకుంటారు. సభలో వేసిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం రాదు.. వచ్చినా సరైన సమాచారం ఉండదన్న అభిప్రాయం కలిగించొద్దు’ అని విఠపు సూచించారు. దీంతో ప్రశ్నను సరిగా అర్థం చేసుకోలేక పోవడం వల్లనే సమస్య వచ్చిందని ఇబ్బంది పడుతూ మంత్రి బొత్స సమాధానం సమాధానం చెప్పాల్సి వచ్చింది.
ప్రభుత్వ చర్యలతో.. ప్రాథమిక విద్య కుప్పకూలింది
‘ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థ కుప్పకూలింది. హేతుబద్ధీకరణ, సబ్జెక్ట్ టీచర్ విధానం, 3, 4 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం వంటి చర్యలతో ఈ పరిస్థితి వచ్చింది. 771 పోస్టులు భర్తీ చేస్తే సరిపోతుందా? ఉపాధ్యాయల బదిలీలు చేయడానికి ముందు పాఠశాలల్లో సుమారు 30 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని డీఈవోలు నివేదికలు ఇచ్చింది వాస్తవం కాదా? దశల వారీగా తెలుగు మీడియం తొలగించేశారు. 1.87 లక్షల శాంక్షన్ పోస్టులు ఉంటే.. వాటిని 1.60 లక్షలకు తగ్గించడం వాస్తవం కాదా? ఇలా పోస్టుల్లో కోత పెట్టి ఖాళీలు లేవని చెప్పడం భావ్యం కాదు’ అని ఎమ్మెల్సీ విఠపు అన్నారు. ఈ చర్చలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ సాబ్జి మాట్లాడుతూ ‘మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీ చేయడం లేదు. గత ప్రభుత్వం 2018లో ఒక డీఎస్సీ వేసింది. 2019 మే డీఎస్సీ తరవాత.. వైకాపా హయాంలో ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది’ అని అన్నారు. సమావేశాలు ముగిసిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి ఖాళీలపై నిర్ణయం తీసుకుందామని మంత్రి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!