హత్యలు చేసినోళ్లను తప్పించి గోరు గీసుకుపోయినోళ్లపై కేసులు!
రూ.లక్షల కోట్లు దోచుకొని విదేశాలకు పారిపోయిన వాళ్లను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. ఉందో లేదో తెలియని రూ.వంద కోట్ల వ్యవహారాన్ని కుంభకోణంగా ప్రచారం చేస్తూ.. వేధిస్తోందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
కవితపై ఆరోపణలకు కిషన్రెడ్డి క్షమాపణలు చెప్పాలి: మంత్రి శ్రీనివాస్గౌడ్
ఈనాడు, దిల్లీ: రూ.లక్షల కోట్లు దోచుకొని విదేశాలకు పారిపోయిన వాళ్లను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం.. ఉందో లేదో తెలియని రూ.వంద కోట్ల వ్యవహారాన్ని కుంభకోణంగా ప్రచారం చేస్తూ.. వేధిస్తోందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. దిల్లీ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత్ మోదీ, చోక్సీ వంటి వారు రూ.లక్షల కోట్లు కొల్లగొట్టి విదేశాల్లో జల్సాలు చేసుకుంటుంటే ఏం చేయలేకపోతున్నారని ఆయన విమర్శించారు. దిల్లీ మద్యం కేసులో రూ.వంద కోట్లు చేతులు మారాయంటున్నారని, అది ఉల్లిపొట్టులాంటిదని, అందులో కుంభకోణం ఉందో లేదో తెలియదన్నారు. ఈ కేసులో తెలంగాణ ఆడబిడ్డ కవితను అనవసరంగా హింసిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరు.. వంద హత్యలు చేసినోళ్లను తప్పించి గోరు గీసుకుపోయిన వారిపై కేసు పెట్టినట్లుందని ఆయన ఎద్దేవా చేశారు. మద్యం విధానంలో కవిత పాత్ర ఉందనడం కల్పితమని, విచారణ అనంతరం ఆమె సింహంలా గర్జిస్తారని అన్నారు. రూ.కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను కవిత ధ్వంసం చేశారంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపణలు చేశారని.. అందుకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. మంగళవారం ఈడీ విచారణకు వెళ్తూ కవిత ఆ ఫోన్లను చూపినందున కిషన్రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బెదిరింపులకు కేసీఆర్ లొంగరని, దేశ ప్రయోజనాల కోసం ఆయన పోరాటం కొనసాగుతుందన్నారు. సౌత్ గ్రూప్ అంటూ దక్షిణాది రాష్ట్రాలను అవమానించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఈ సమావేశంలో ఎంపీలు వెంకటేష్ నేత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి