‘స్కిల్’ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం
‘స్కిల్’ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్
ఈనాడు-విశాఖపట్నం: ‘స్కిల్’ స్కాంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈడీ కస్టడీకి పది మందిని అప్పగించారన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఇక మిగిలి ఉన్నారని చెప్పారు. ఈ స్కాంలో భాగంగా రెండు టోకెన్లు హైదరాబాద్ చేరిపోయాయనే సమాచారం విచారణ సమయంలో దొరికిందని, ఆ టోకెన్లు ఎవరి జేబులోకి వెళ్లాయో త్వరలో తేల్చుతారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. చంద్రబాబుకు అవినీతిలో నోబెల్ ఫ్రైజ్, యాక్టింగ్లో ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందినవని, అయినప్పటికీ ఓటమికి కారణాలను సమీక్షించి, వారి మనసులు గెలుచుకుంటామన్నారు. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటారని, ఆ రోజు చరిత్ర మళ్లీ తిరగరాస్తామని చెప్పారు. అంత సరదా ఉంటే లోకేశ్ను పులివెందులలో పోటీ చేయాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా