పీఏసీలో ఖాళీలు భర్తీ చేయండి
ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ)లో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారామ్కు ఆ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మంగళవారం లేఖ రాశారు.
సభాపతికి పయ్యావుల కేశవ్ లేఖ
ఈనాడు, అమరావతి: ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ)లో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారామ్కు ఆ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మంగళవారం లేఖ రాశారు. ‘‘ఛైర్మన్ సహా 12మంది సభ్యులతో పీఏసీ ఏర్పాటైంది. తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉండేవారు. వారిలో కొందరు మంత్రులు, డిప్యూటీ స్పీకర్, విప్గా నియమితులయ్యారు. ఎమ్మెల్సీల్లో కొందరు సభ్యులు పదవీవిరమణ చేశారు. దీంతో పీఏసీలో.. శాసనసభ నుంచి 5, మండలి నుంచి 2 ఖాళీలు ఏర్పడ్డాయి. కమిటీ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయటానికి ఆటంకం ఏర్పడుతోంది. ఆ ఖాళీలు భర్తీచేయాలని కోరుతూ గతేడాది అక్టోబరు 21న అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశాను. అయినా చేయలేదు. ఇప్పటికైనా ఆ ఖాళీలను భర్తీచేస్తే పూర్తిస్థాయి కమిటీ కార్యకలాపాలను నిర్వహించగలదు’’ అని ఆ లేఖలో ప్రస్తావించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Shiv Sena: మహారాష్ట్రలో మళ్లీ రాజకీయ అలజడి..ఆసక్తి రేపుతున్న శివసేన నేతల వ్యాఖ్యలు!
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!
-
World News
Flight Passengers: బ్యాగేజ్తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్లైన్స్ సంస్థ!
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్కు భర్త బాంబు బెదిరింపు ఫోన్కాల్!
-
Politics News
Andhra News: మరోసారి నోరు జారిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
-
General News
Bed Rotting: ఏమిటీ ‘బెడ్ రాటింగ్’.. ఎందుకంత ట్రెండ్ అవుతోంది..?