ఇది రాజకీయ ప్రేరేపిత చర్య.. కవితతో సీఎం కేసీఆర్
ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన చర్య అని.. ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. దీటుగా ఎదుర్కొందామని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టంచేసినట్లు సమాచారం.
ఆందోళన అక్కర్లేదు.. దీటుగా ఎదుర్కొందాం
ఈనాడు, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన చర్య అని.. ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలిసింది. దీటుగా ఎదుర్కొందామని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టంచేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్తో భారాస ఎమ్మెల్సీ కవిత బుధవారం భేటీ అయ్యారు. దిల్లీలో మంగళవారం రాత్రి ఈడీ విచారణ అనంతరం బుధవారం ఉదయం భర్త అనిల్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావులతో కలిసి ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. అందరూ నేరుగా ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. గత మూడు రోజులుగా దిల్లీలో జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా సీఎంకు వారు వివరించినట్లు సమాచారం. ఇకపై ఈడీ విచారణ తీరు ఎలా ఉండబోతోంది? దర్యాప్తు సంస్థలను న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి? కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై ఈ నెల 24న విచారణ.. తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. వాస్తవానికి దిల్లీలో జరుగుతున్న పరిణామాలను మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలియజేసినా.. విచారణలో ఈడీ ఎలాంటి ప్రశ్నలు సంధించింది? కవిత ఏం సమాధానాలు చెప్పారు? తదితర అంశాలను బుధవారం సీఎంకు నేరుగా వివరించినట్లు సమాచారం. సమావేశం అనంతరం కవిత తన నివాసానికి చేరుకున్నారు. ‘‘తెలుగింటి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు’’ అంటూ కవిత ట్వీట్ చేశారు. ఉగాది సందర్భంగా తన నివాసంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..