మంత్రి కేటీఆర్నూ విచారణకు పిలవాలి
‘‘గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో అక్రమాలపై అధికారులు, సహచర మంత్రులతో సమావేశం నిర్వహించి పత్రికలు, ఛానెళ్లకు వివరాలిచ్చిన మంత్రి కేటీఆర్నూ విచారణకు పిలవాలి.
ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్
సిట్ విచారణకు హాజరు
ఈనాడు-హైదరాబాద్, న్యూస్టుడే-నారాయణగూడ: ‘‘గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో అక్రమాలపై అధికారులు, సహచర మంత్రులతో సమావేశం నిర్వహించి పత్రికలు, ఛానెళ్లకు వివరాలిచ్చిన మంత్రి కేటీఆర్నూ విచారణకు పిలవాలి. ప్రవీణ్, రాజశేఖర్రెడ్డిల పాత్రపై కేటీఆర్ వివరాలు తెలిపారంటే అక్రమాలన్నీ ఆయనకు తెలిసే ఉండాలి. ఆయనను విచారణకు పిలవకపోతే న్యాయపరంగా ముందుకెళ్తాం’’ అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లోని హిమాయత్నగర్లో ఉన్న సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని ‘సిట్’ అధికారి ఎ.ఆర్.శ్రీనివాస్కు ఇచ్చినట్లు తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ అక్రమాల్లో పెద్దవారికి ప్రమేయం ఉందని, ఇది మధ్యప్రదేశ్లో గతంలో జరిగిన ‘వ్యాపం’ తరహా కుంభకోణమని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘‘విచారణ పారదర్శకంగా జరగాలంటే కేసును సీబీఐకి అప్పగించాలి. కొందరు ప్రవాస భారతీయులూ పరీక్షలు రాశారు. రూ.లక్షలు చేతులు మారినట్లు ప్రాథమిక సాక్ష్యాలు పోలీసులకు లభించినందువల్ల ఈడీ కూడా దర్యాప్తు చేపట్టాలి. మంత్రి కేటీఆర్తో పాటు టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి, సభ్యులందరినీ తొలగించాలి. టీఎస్పీఎస్సీలో కొత్త కంప్యూటర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆరేళ్ల క్రితం కేటీఆర్ తన ఐటీశాఖ ద్వారా ఇప్పించారు. అప్పటి ఛైర్మన్ ఘంటా చక్రపాణితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన పెన్డ్రైవ్ను, సాక్ష్యాధారాలను సిట్ అధికారులకు ఇచ్చాను. కేటీఆర్పై ఫిర్యాదు చేయగా.. తీసుకోమంటూ తిరస్కరించారు. ఫిర్యాదు బదులుగా.. సమాచారం అని రాస్తే తీసుకున్నారు. తెలంగాణ మేధావులు ప్రస్తుత పరిస్థితులపై కేసీఆర్ను ఎందుకు నిలదీయరు’’ అని రేవంత్ ప్రశ్నించారు. రేవంత్రెడ్డి విచారణకు హాజరైన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిట్ కార్యాలయం వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని పోలీసులు అరెస్ట్ చేసి వేర్వేరు ఠాణాలకు తరలించారు. రేవంత్రెడ్డి సిట్ విచారణ నేపథ్యంలో హైదరాబాద్తో పాటు జిల్లాల్లో పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులను రేవంత్రెడ్డి ఖండించారు.
మంత్రి పదవికి ఇంద్రకరణ్రెడ్డి రాజీనామా చేయాలి: భట్టి
ప్రశ్నపత్రాల లీకేజీ సర్వసాధారణమని చెప్పిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దర్యాప్తు అధికారులకు సమాచారం కావాలంటే.. ఇళ్లకు వెళ్లి సేకరిస్తారని, రేవంత్రెడ్డిని సిట్ కార్యాలయానికి పిలవడం సరికాదని పేర్కొన్నారు.
రేవంత్పై చట్టపరమైన చర్యలకు యోచన
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రేవంత్రెడ్డి గురువారం సిట్ ముందు హాజరై సుమారు గంటపాటు సిట్ కార్యాలయంలో ఉన్నారు. ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాల గురించి అధికారులు ఆరా తీశారు. కేసు దర్యాప్తునకు ఉపకరించదగిన ఆధారాలను ఇవ్వలేదని.. ఆయన నిరాధార ఆరోపణలు చేశారని సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. న్యాయనిపుణుల సలహా అనంతరం రేవంత్పై చట్టపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు
తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. -
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్