స్ఫూర్తిదాయక ప్రస్థానం
శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం.
26 ఏళ్ల పిన్న వయసులోనే విజయవాడ మేయర్గా పంచుమర్తి అనురాధ ఎన్నిక
ఇప్పుడు ఎమ్మెల్సీగా విజయం
ఈనాడు, అమరావతి: శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని, ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ఆమె... 26 సంవత్సరాల పిన్న వయసులోనే ప్రత్యక్ష ఎన్నికల్లో విజయవాడ మేయర్గా ఎన్నికై అత్యంత పిన్నవయస్కురాలైన మేయర్గా.. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. తెదేపాలోనే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అనురాధ... 23 సంవత్సరాలుగా పార్టీనే అంటిపెట్టుకుని క్రమశిక్షణగల కార్యకర్తగా, సమర్థతగల నాయకురాలిగా, పార్టీకి విధేయురాలిగా పేరు తెచ్చుకున్నారు. పార్టీలో పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2014లో తెదేపా అధికారంలోకి వచ్చాక... అనురాధ సేవలకు గుర్తింపుగా ఆమెను ఎమ్మెల్సీగా పంపాలని పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. తనకు కేటాయించిన ఎమ్మెల్సీ స్థానానికి రెండేళ్ల కాలపరిమితే ఉందన్న కారణంతో అప్పట్లో ఆ పదవి తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. ఆ తర్వాత ఆమెకు రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని తెలిసినా.. పార్టీ అధినేత సూచన మేరకు పోటీకి సిద్ధమయ్యారు. ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు.
వివాహం తరవాతా చదువు కొనసాగింపు..
అనురాధ తండ్రి స్వర్గం పుల్లారావు ఆదాయ పన్నుల శాఖలో జాయింట్ కమిషనర్గా పనిచేశారు. ఆమె డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగానే పారిశ్రామికవేత్త శ్రీధర్తో వివాహమైంది. వివాహం తర్వాత కూడా చదువు కొనసాగించిన ఆమె... 1996లో డిగ్రీ పూర్తి చేశారు. 2007లో జర్నలిజంలో పీజీ పట్టా తీసుకున్నారు.
అనూహ్యంగా రాజకీయాల్లోకి
తెదేపా అధినేత చంద్రబాబు 1999 రాజకీయాల్లోకి తటస్థులను ఆహ్వానించగా..విజయవాడకు చెందిన, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన అనురాధ ఎన్నికల్లో టికెట్ కోసం దరఖాస్తు చేశారు. అప్పుడు ఆమెకు పిలుపు రాలేదు. 2000 సంవత్సరంలో విజయవాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు వచ్చాయి. మేయరు పదవి బీసీ మహిళలకు రిజర్వు చేశారు. తెదేపా ప్రధాన కార్యాలయం నుంచి అనురాధకు పిలువు వచ్చింది. మొత్తం 18 మంది మహిళలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆ తర్వాత చంద్రబాబుతో ముఖాముఖి. బీఎస్సీ ఎలాక్ట్రానిక్స్ చదివిన ఆమెకు, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉందని తెలుసుకుని... దానికి సంబంధించి చంద్రబాబు పలు ప్రశ్నలు సంధించారు. వాటికి చకాచకా సమాధానాలు చెప్పిన ఆమె చంద్రబాబు దృష్టిలో పడ్డారు. రెండు రోజుల తర్వాత విజయవాడ మేయరు అభ్యర్థిగా ఆమె పేరుని తెదేపా ప్రకటించింది. అప్పటికి ఎలాంటి రాజకీయ అనుభవం లేని అనురాధ... ఆ ఎన్నికల్లో 6,800 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.
జీవోల మేయర్గా పేరు..
ప్రత్యక్ష ఎన్నికల్లో అనురాధ మేయర్గా ఎన్నికైనా, పాలకమండలిలో తెదేపా సంఖ్యా బలం తక్కువగా ఉండేది. మొత్తం 50 డివిజన్లలో, తెదేపా 11 మాత్రమే గెలుచుకుంది. మెజారిటీ డివిజన్లను కాంగ్రెస్ గెలుచుకుంది. పాలకవర్గ సమావేశంలో మేయరు ప్రతిపాదనలు చెల్లేవి కాదు. కానీ అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు అండతో...ఆమె ప్రత్యేక జీవోల ద్వారా నిధులు మంజూరు చేయించుకుని, విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆమె హయాంలో విజయవాడకు సంబంధించి సుమారు 17 జీవోలు వచ్చాయి. దాంతో ఆమెను అందరూ జీవోల మేయరని పిలిచేవారు. మేయర్గా ఎన్నికయ్యే నాటికి ఆమెకు ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోవడంతో... విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో రాజకీయ శాస్త్ర అధ్యాపకులు పార్థసారధి దగ్గరకు ట్యూషన్కు వెళ్లి, వివిధ చట్టాలు, సమకాలీన రాజకీయ పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ఆమె చురుగ్గా పనిచేశారు. 11 రోజులపాటు నిరాహార దీక్ష చేశారు.
క్యాన్సర్ను జయించి..
తెదేపాలో అత్యంత చురుగ్గా పనిచేస్తున్న సమయంలో ఆమెకు క్యాన్సర్ సోకింది. ఆమె ధైర్యం కోల్పోకుండా, చికిత్స పొంది క్యాన్సర్పై విజయం సాధించారు. ఆ తర్వాత కూడా పార్టీలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
బహుముఖ ప్రజ్ఞ
అనురాధ ఒకపక్క రాజకీయాల్లో కొనసాగుతూనే... గత 15 సంవత్సరాలుగా పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీరప్రాంతంలోని చేనేత సామాజిక వర్గానికి సేవలందిస్తున్నారు. ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆహ్వానం మేరకు 300 మంది ట్రైనీ ఐఏఎస్లను ఉద్దేశించి.. ‘నాయకత్వ కళ, మంచి పరిపాలన కోసం బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకుల మధ్య సత్సంబంధాలు’ అన్న అంశంపై ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వ అరాచకాలపై పోరాడినందుకు ఈ నాలుగేళ్లలో ఆమెపై పదికిపైగా కేసులు నమోదయ్యాయి.
అనురాధ ప్రొఫైల్
పేరు: పంచుమర్తి అనురాధ
నివాసం: పోరంకి
విద్యాభ్యాసం: సెయింట్ ఆన్స్ హైదరాబాద్, అట్కిన్సన్ విజయవాడల్లో పాఠశాల విద్యాభ్యాసం
ఇంటర్మీడియట్: స్టెల్లా కళాశాల, విజయవాడ
డిగ్రీ: బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ జేకేసీ కళాశాల, గుంటూరు
మాస్టర్స్ డిగ్రీ: ఎంఏ జర్నలిజం
వివాహం: 1995
పిల్లలు: ఒక కుమార్తె. పేరు సాయి శ్రీధరణి
మొదటి పదవి: విజయవాడ మేయర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు