నేడు సిట్‌ విచారణకు బండి సంజయ్‌ గైర్హాజరు!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ విచారణకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ హాజరు కారని తెలిసింది.

Published : 24 Mar 2023 04:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్‌ విచారణకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ హాజరు కారని తెలిసింది. శుక్రవారం తమ ముందు హాజరు కావాలని సంజయ్‌కి సిట్‌ నోటీసు జారీ చేసింది. ఈమేరకు ఆయన నివాసం వద్ద మంగళవారం నోటీసును పోలీసులు అతికించారు. అయితే పార్లమెంట్‌ సమావేశాలకు విధిగా హాజరు కావాలని భాజపా పార్లమెంటరీ పార్టీ విప్‌ జారీ చేసిన నేపథ్యంలో సిట్‌ విచారణకు సంజయ్‌ హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై సిట్‌తో కాకుండా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్‌ ఇప్పటికే డిమాండ్‌ చేశారు. సిట్టింగ్‌ జడ్జికే తమ వద్ద ఉన్న వివరాలను అందిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని