పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?
‘నాలుగేళ్లలో పోలవరం పనులు ఏమేరకు చేశారో.. నిర్వాసితులకు ఎంత సొమ్ము ఇచ్చారో...పూర్తి వివరాలు, వాస్తవాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేసే దమ్ము సీఎం జగన్కు ఉందా’ అని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాలు విసిరారు.
అసెంబ్లీ సాక్షిగా కట్టుకథలు చెబుతారా?
తెదేపా నేత దేవినేని ఉమా ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: ‘నాలుగేళ్లలో పోలవరం పనులు ఏమేరకు చేశారో.. నిర్వాసితులకు ఎంత సొమ్ము ఇచ్చారో...పూర్తి వివరాలు, వాస్తవాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేసే దమ్ము సీఎం జగన్కు ఉందా’ అని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాలు విసిరారు. తెదేపా హయాంలో ప్రాజెక్టును చంద్రబాబు 72 శాతం పూర్తి చేస్తే....మిగతాది పూర్తి చేయకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 46 నెలలుగా డీపీఆర్-2 అంచనా వ్యయం రూ.55,548 కోట్లను కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింప చేయించుకోలేని సీఎం... కొన్ని నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘పాదయాత్ర సమయంలో నిర్వాసితులకు రూ.19 లక్షలు ఇస్తానని చెప్పి అధికారంలోకి రాగానే రూ.10లక్షలని మాట మార్చారు. తరవాత ఆ సొమ్ము కూడా ఇవ్వకుండా నిర్వాసితుల నోట్లో మట్టి కొట్టారు. రూ.500 కోట్లకు ఇచ్చిన జీవో ఏమైంది? ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియకుండానే నిర్వాసితుల సొమ్మును తినేశారా?’ అని ఉమా ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వ అసమర్థతే దెబ్బతీసింది...
‘గోదావరి వరదను అంచనా వేయలేకపోవడం జగన్ ప్రభుత్వ అసమర్థత. అదే కాఫర్డ్యామ్ను దెబ్బతీసింది. స్పిల్ వే నిర్మాణం ఎలా చేశారో? ఎంత ఎత్తు నుంచి చేశారో..జగన్కు అతని మంత్రులకు తెలుసా? పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్...లోయర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగలేదని, 22 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాలని అప్పట్లోనే చెప్పినా జగన్ ప్రభుత్వం నిద్రపోయింది. దాని వల్ల గోదావరికి వచ్చిన వరద లోయర్ కాఫర్ డ్యామ్ను ముంచి అప్పర్ కాఫర్ డ్యామ్ను దెబ్బతీసింది. దీంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. దాని నిర్మాణాన్ని గాలికొదిలి గుంతలు పూడ్చటానికి రూ.2 వేల కోట్లు అవుతాయంటూ ఆ డబ్బు కొట్టేసేపనిలో జగన్ ఉన్నారు’ అని ఆరోపించారు.
డ్యామ్గా మార్చే హక్కు ఎవరిచ్చారు?
‘కేంద్ర విజిలెన్స్ మార్గదర్శకాలను పక్కన పెట్టి మరీ జగన్ రివర్స్ టెండరింగ్ నాటకాలు ఆడారు. పోలవరం ప్రాజెక్టును పోలవరం డ్యామ్గా మార్చే హక్కు జగన్కు ఎవరిచ్చారు? 46 నెలల్లో పూర్తి చేయలేని వ్యక్తి...కొన్ని నెలల్లో పూర్తి చేస్తామని కట్టుకథలు చెబుతున్నారు. రూ.2,600 కోట్ల కేంద్ర నిధులు రాబట్టుకోలేక అసమర్థ సీఎం కొన్ని నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తారా? కాంట్రాక్టర్ని మార్చవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా వినలేదు. పీటర్ కమిటీ పేరుతో పిచ్చి పనులు చేశారు. ఎత్తుని 41.15 మీటర్లకు ఎందుకు పరిమితం చేస్తున్నారు?’ అని మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM