తొలిసారి కొందరు.. అదృష్టం వరించి మరికొందరు..
డీఐజీగా వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినవారు ఒకరు.. ఉప సర్పంచిగా ప్రజా జీవితం ఆరంభించింది మరొకరు.. గతంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు ఇద్దరు.. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా పనిచేసిన మరో ఇద్దరు.. ఇలా ఆరుగురు తాజాగా పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు.
వైకాపా ఎమ్మెల్సీల రాజకీయ ప్రస్థానమిది
ఈనాడు, అమరావతి: డీఐజీగా వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చినవారు ఒకరు.. ఉప సర్పంచిగా ప్రజా జీవితం ఆరంభించింది మరొకరు.. గతంలో ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు ఇద్దరు.. ఇప్పటికే ఎమ్మెల్సీలుగా పనిచేసిన మరో ఇద్దరు.. ఇలా ఆరుగురు తాజాగా పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచిన ఆరుగురి రాజకీయ ప్రస్థానమిదీ..
నాడు స్వతంత్ర ఎమ్మెల్యేగా.. నేడు వైకాపా ఎమ్మెల్సీగా
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలేనికి చెందిన మర్రి రాజశేఖర్ ఎట్టకేలకు శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు. ఓసారి ఎమ్మెల్యేగా గెలుపొందినా, తర్వాత వరుసగా ఓటమిపాలయ్యారు. తాజాగా ఎమ్మెల్సీగా గెలుపొందారు. మర్రి రాజశేఖర్ మేనమామ సోమేపల్లి సాంబయ్య చిలకలూరిపేట నుంచి కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చిలకలూరిపేటలో న్యాయవాద వృత్తిలో ఉన్న మర్రి రాజశేఖర్.. సాంబయ్య మరణానంతరం ఆయన వారసుడిగా కాంగ్రెస్లో కొనసాగారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం మల్లాది శివన్నారాయణకు చిలకలూరిపేట సీటు కేటాయించడంతో, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి ఎన్నికల ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి రాజశేఖర్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో రాజశేఖర్ గెలుపొందారు. 2008లో తితిదే, వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2011లో వైకాపాలో చేరారు. 2014లో వైకాపా తరపున చిలకలూరిపేట నుంచి పోటీ చేసి మళ్లీ ఓటమిపాలయ్యారు. 2019లో టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందారు. ఆయన 2011 నుంచి 2019 వరకు గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షుడిగా పని చేశారు.
పార్టీ మారారు.. ఎమ్మెల్సీగా గెలిచారు
రెండున్నర దశాబ్దాలకు పైగా తెదేపాలో కొనసాగిన జయమంగళ వెంకటరమణ అనూహ్యంగా పార్టీని వీడి, వైకాపా తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్సీగా గెలుపొందారు. కైకలూరు మండలం కొట్టాడకు చెందిన ఆయన గ్రామ సర్పంచిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2001లో తెదేపా నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2009 వరకు తెదేపా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2009లో కైకలూరు తెదేపా కీలక నేతలు కమ్మిలి విఠల్రావు, కామినేని శ్రీనివాస్ పార్టీని వీడటంతో అనూహ్యంగా కైకలూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా భాజపా అభ్యర్థి కామినేనికి ఈ సీటు కేటాయించడంతో భంగపడ్డారు. 2019లో తెదేపా తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామనే హామీతో ఇటీవల వైకాపాలో చేరిన ఆయన టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఉప సర్పంచి నుంచి.. ఎమ్మెల్సీగా ఇజ్రాయేల్
ఉప సర్పంచిగా ప్రజా జీవితాన్ని ఆరంభించిన బొమ్మి ఇజ్రాయేల్ ఎమ్మెల్సీగా శాసన మండలిలోకి అడుగుపెట్టనున్నారు. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన ఆయన 2008 నుంచి 2013 వరకు ఉప సర్పంచిగా పని చేశారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. గతేడాది డిసెంబరులో అమలాపురంలో మాదిగ ఉపకులాలతో బహిరంగ సభ నిర్వహించి, తమ సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్ను తెరపైకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ దక్కగా తాజా ఎన్నికల్లో గెలుపొందారు.
వరుసగా మూడోసారి ఎమ్మెల్సీగా పోతుల సునీత
పోతుల సునీత వరుసగా మూడోసారి ఎమ్మెల్సీగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లో తెదేపా తరపున జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో అలంపూర్ నుంచి, 2014లో చీరాల నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2017లో తెదేపా తరఫున ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. అనంతరం తెదేపాకు రాజీనామా చేసి, అధికార పార్టీలో చేరారు. సునీత రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సీఎం జగన్ ఆమెకే మళ్లీ అవకాశం ఇచ్చారు. పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో మరోసారి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చారు. దీంతో సునీత వైకాపా అభ్యర్థిగా బరిలో నిలిచి, గెలిచారు.
ఎమ్మెల్యేగా ఓడి.. ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ డీఐజీ
డీఐజీగా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చిన చంద్రగిరి ఏసురత్నం నాలుగేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోగా, ఇపుడు ఎమ్మెల్సీగా గెలుపొందారు. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన ఆయన 1982లో ఎస్సైగా ఎంపికయ్యారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, జనార్ధన్రెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి వద్ద భద్రతాధికారిగా పని చేశారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి డీఐజీ స్థాయికి చేరుకున్నారు. 2018లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, వైకాపాలో చేరారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్గా వరుసగా రెండుసార్లు నామినేటెడ్ పదవి పొందారు. ఇటీవల ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో మిర్చి యార్డు ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
పెద్దల సభకు రెండోసారి.. దంత వైద్యుడు సూర్యనారాయణరాజు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మొయిద విజయరాంపురానికి చెందిన దంత వైద్యుడు డాక్టర్ పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణరాజు రెండోసారి ఎమ్మెల్సీ అయ్యారు. దివంగత మాజీ మంత్రి, సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడైన సూర్యనారాయణ తొలుత ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నారు. 2014లో నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కకపోయినప్పటికీ, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. 2020లో ఆయన తండ్రి సాంబశివరాజు మృతి చెందగా, అదే ఏడాది ఆగస్టులో సూర్యనారాయణరాజుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కూడా అవకాశమిచ్చారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్