Andhra News: ఎమ్మెల్యే శ్రీదేవి ఫ్లెక్సీలను చించేసిన వైకాపా నాయకులు

గుంటూరు చంద్రమౌళీనగర్‌లోని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు ఆందోళనకు దిగారు.

Published : 25 Mar 2023 07:47 IST

గోరంట్ల, తుళ్లూరు, న్యూస్‌టుడే: గుంటూరు చంద్రమౌళీనగర్‌లోని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నియోజకవర్గానికి చెందిన వైకాపా నాయకులు ఆందోళనకు దిగారు. స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవడంతో కార్యాలయం ఎదుట శ్రీదేవికి వ్యతిరేకంగా నినదించారు. క్యాంపు కార్యాలయం వద్దనున్న ఫ్లెక్సీలను చించివేశారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీదేవి ఓటును అమ్ముకున్నారని, తమకు ఇలాంటి ఎమ్మెల్యే వద్దంటూ నినదించారు. ఫ్లెక్సీలను తొలగిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైకాపా నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదమేర్పడింది. ఆందోళనలో వైకాపా తుళ్లూరు మండల నాయకులు శృంగారపాటి సందీప్‌, బి.వెంకటశివారెడ్డి, జోజి, సీహెచ్‌ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. వారు వెలగపూడిలోని ప్రధాన రహదారిపై శ్రీదేవి దిష్టిబొమ్మనూ దహనం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని