కాంగ్రెస్కు వరమా.. శాపమా?
దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటం, ఆ వెంటనే లోక్సభ సభ్యత్వానికి అనర్హుడు కావడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది.
ప్రధాన ప్రతిపక్షానికిది ఆయుధంగా మారుతుంది
ప్రజల్లో సానుభూతి వస్తుంది
రాహుల్పై అనర్హత వేటుపై రాజకీయ నిపుణుల విశ్లేషణ
స్టే ఉత్తర్వులు రాకపోతే నష్టమేనని హెచ్చరిక
దిల్లీ: దేశంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడటం, ఆ వెంటనే లోక్సభ సభ్యత్వానికి అనర్హుడు కావడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. తాజా పరిణామాలు కాంగ్రెస్కు ఎదురుదెబ్బగా ప్రస్తుతం కనిపిస్తున్నప్పటికీ ఆ పార్టీకి, రాహుల్కు అంతిమంగా లబ్ధి కలిగిస్తాయని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజకీయంగానే కాకుండా న్యాయ పోరాటానికీ సిద్ధంకావాల్సిన అనివార్య పరిస్థితి కాంగ్రెస్కు ఏర్పడిందని, దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో వచ్చే కదలిక సంస్థాగతంగా బలోపేతం కావడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.
అవకాశం...అవరోధం కూడా..
‘లోక్సభ సభ్యత్వానికి అనర్హుడు కావడం తక్షణం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బగా కనిపిస్తోంది. అయితే, భారత్ జోడో యాత్రతో ప్రజాదరణను పొందిన రాహుల్కు ప్రస్తుత పరిణామాలు అదనపు ప్రయోజనం కలిగిస్తాయ’ని సామాజిక శాస్త్రాల ప్రొఫెసర్ ఒకరు వ్యాఖ్యానించారు. బాధితుడిగా మారిన రాహుల్ గాంధీ ‘హీరో’గా అవతరిస్తారని తెలిపారు. అయితే, తనకు విధించిన జైలు శిక్షను, అనర్హత వేటును రాహుల్ రద్దు చేయించుకోకపోతే ఆయన రాజకీయ జీవితానికి అవే అవరోధంగా మారుతాయని హెచ్చరించారు. ‘‘ఒక ఏడాది వ్యవధి మాత్రమే ఉన్న ప్రస్తుత లోక్సభకు అనర్హుడు కావడం వల్ల పెద్దగా సమస్య ఎదురుకాదు. అసలైన ప్రమాదం ఏమిటంటే.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేకపోవడం. ప్రజాదరణ ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోతే పార్టీకి ఎలా నేతృత్వం వహించగలరు. కనుక తక్షణమే అనర్హత వేటు నుంచి రక్షణ పొందాల్సిన అవసరం ఉంద’’ని స్పష్టం చేశారు.
విపక్షాలన్నీ ఏకతాటిపైకి..
రాహుల్ గాంధీపై అనర్హత వేటు వల్ల ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి వస్తోందని రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ ఒకరు అభిప్రాయపడ్డారు. త్వరలో జరిగే అసెంబ్లీల ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. తాజా పరిణామాలతో 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట విపక్షాలన్నిటినీ భాజపా ఏకం చేసిందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సంజయ్ ఝా తెలిపారు. భాజపా వ్యతిరేక పార్టీలన్నీ కలిసి పనిచేసేందుకు అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు.
వెంటనే అప్పీలుకు వెళ్లాలి...
కోర్టు తీర్పు అమలును నిలుపుదల(స్టే) చేసే ఉత్తర్వులు పొందగలిగితే లోక్సభ సభ్యత్వ అనర్హతను తొలగించాలని సభాపతిని కోరే అవకాశం రాహుల్కు లభిస్తుందని న్యాయనిపుణులు తెలిపారు. రాహుల్ వెంటనే ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేయాలని సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ సూచించారు. ఆలస్యం చేస్తే ఎన్నికల సంఘం రంగ ప్రవేశం చేసి వయనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ను ప్రకటిస్తుందన్నారు. రాహుల్కు విధించిన జైలు శిక్షను హైకోర్టు నిలుపుదల చేయగలదని, తద్వారా ఆయన లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణకు వీలు కలుగుతుందని మరో సీనియర్ న్యాయవాది అజిత్ సిన్హా అభిప్రాయపడ్డారు.
స్టే రాకపోతే..8 ఏళ్లు పోటీ చేయలేరు
సూరత్ కోర్టు విధించిన శిక్షను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయకపోతే రాహుల్ 8 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరని సంబంధిత నిబంధనలపై విశేష అవగాహన ఉన్న నిపుణుడు ఒకరు తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం..జైలు శిక్ష అనుభవించే రెండేళ్లతో పాటు విడుదలైన తర్వాత ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీకి అనర్హులు. ఇలా మొత్తం 8 ఏళ్లు ఎన్నికలకు దూరంగా ఉండాల్సి వస్తుందని వివరించారు. ప్రస్తుత లోక్సభ గడువు వచ్చే ఏడాది జూన్లో ముగుస్తుందనుకుంటే ఏడాదికి పైగా సమయం ఉంది. కనుక వయనాడ్ లోక్సభ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ప్రకటించ వచ్చు. ఏడాది కన్నా తక్కువ వ్యవధి ఉంటే ఉప ఎన్నికలకు వెళ్లదు. సూరత్ కోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్లేందుకు నెల రోజులున్నందున అప్పటివరకూ ఎన్నికల సంఘం వేచి చూస్తుందని, ఆ లోగా రాహుల్ స్టే ఆదేశాలు పొందకపోతేనే తదుపరి చర్యలు చేపడుతుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఎన్నికల కమిషన్ ఆదేశించింది. -
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
దక్షిణాదిలో భాజపా ఈసారి అత్యుత్తమ పనితీరు కనబరుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం వ్యక్తంచేశారు. -
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం, రాజంపేట భాజపా అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు. -
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. -
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది. -
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. -
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్