ఎర్ర గీత దాటారని తెదేపా సభ్యుల సస్పెన్షన్
జీవో-1 రద్దుకు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టి స్పీకర్ పోడియం ముందున్న ఎర్రగీతను దాటి వెళ్లి నిరసన తెలిపినందుకు తెలుగుదేశం శాసనసభ్యులు ఒకరోజు సస్పెన్షన్కు గురయ్యారు.
జీవో-1 రద్దు వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించని సభాపతి
పోడియం ముందు తెదేపా నిరసన
గీత దాటారంటూ ఒక రోజు సస్పెన్షన్
ఈనాడు, అమరావతి: జీవో-1 రద్దుకు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని పట్టుబట్టి స్పీకర్ పోడియం ముందున్న ఎర్రగీతను దాటి వెళ్లి నిరసన తెలిపినందుకు తెలుగుదేశం శాసనసభ్యులు ఒకరోజు సస్పెన్షన్కు గురయ్యారు. శాసనసభ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగానే జీవో-1 రద్దుకు తాము ఇచ్చిన తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలని తెదేపా సభ్యులు డిమాండ్ చేశారు. చర్చ చేపట్టాలని తమ సీట్లలోనే నిలబడి పట్టుబట్టారు. కూర్చోవాలని సభాపతి తమ్మినేని సీతారాం సూచించినా.. ఇది ప్రాధాన్య అంశమని, దీన్ని ముందుగా చర్చకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానంపై అభిప్రాయం చెబుతానంటూ సభాపతి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో తెదేపా సభ్యులు నినాదాలు చేస్తూ వెల్లోకి వెళ్లారు. పోడియం ముందు గీసిన ఎర్రగీత దాటొద్దంటూ సభాపతి వారికి సూచించారు. కొంత సమయం గీతకు అవతల నిలబడి తెదేపా సభ్యులు నిరసన తెలిపారు. సభాపతి దగ్గరుండి చట్టసభలోనే తమను కొట్టించారని తెదేపా శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. జీవో-1 రద్దు చేయాలని, నియంతృత్వ ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ గందరగోళం మధ్యే సభాపతి ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. దీంతో ఒక్కసారిగా తెదేపా సభ్యులు ఎర్ర గీతను దాటి, పోడియం ముందుకు వచ్చారు. సభా నిబంధనల ప్రకారం ఎర్రగీతను దాటినందున తెదేపా ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గద్దె రామ్మోహన్రావు, వెలగపూడి రామకృష్ణ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, గణబాబులను ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలోకి మార్షల్స్ రావడంతో తెదేపా ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ బయటకు వెళ్లిపోయారు. ఇది శాసనసభలా లేదని, సంతాపసభలా ఉందంటూ అచ్చెన్నాయుడు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా గెలవడం దేవుడి స్క్రిప్టు అంటూ వ్యాఖ్యానిస్తూ మరికొంత మంది సభ్యులు బయటికి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM