నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో నష్టపోయిన అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
నష్టపోయిన అభ్యర్థులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి
మహాధర్నాలో బండి సంజయ్
హిమాయత్నగర్, న్యూస్టుడే: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో నష్టపోయిన అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేసేవరకు పోరాడతామని స్పష్టంచేశారు. భాజపా ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మద్దతుగా శనివారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీకేజీలో ఇద్దరి ప్రమేయం మాత్రమే ఉందని మంత్రి కేటీఆర్ ఎలా చెప్పారని ప్రశ్నించారు. ఆ తర్వాత 11 మందిని ఎందుకు అరెస్టు చేశారని నిలదీశారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన కళాకారులు, మేధావులు, విద్యావంతులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? వారు నిరుద్యోగులతో కలసి ముందుకు రావాలి. మరోసారి మిలియన్ మార్చ్ నిర్వహించాలి’ అని పిలుపునిచ్చారు. లీకేజీపై సిట్ వేశారని.. నయీం ఉదంతంలో వేసిన విచారణ బృందం ఏం చేసిందని ప్రశ్నించారు. నయీం నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, భూములు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో భారాసను ఓడించి భాజపా గద్దెనెక్కుతుందని, అప్పుడు నిరుద్యోగుల సమస్య పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఏటా ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. లీకేజీపై పార్టీ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని, పాత పది జిల్లాల పరిధిలో వచ్చే నెల 2 నుంచి 6వ తేదీ వరకు నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే, తెలంగాణ బంద్కు పిలుపునిస్తామన్నారు.
ఒప్పంద ఉద్యోగాలే ఎక్కువయ్యాయి: ఈటల
తెలంగాణ రాకముందు ఒప్పంద, పొరుగు సేవల విధానాన్ని రద్దు చేసి అందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పిన కేసీఆర్.. అధికారంలో ఉండి అదే విధానాన్ని మరింత ఎక్కువగా అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. 1.90 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం శాసనసభలో ప్రకటించినా ఆచరణలో చూపలేదని, గత నాలుగున్నరేళ్ల కాలంలో కేవలం 11 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు. విజయశాంతి మాట్లాడుతూ.. తప్పు చేసింది ప్రభుత్వంలోని వారైతే, ప్రతిపక్ష నాయకులకు సిట్ నోటీసులు జారీ చేస్తోందని మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీకేజీకి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ సిట్ అధికారులు ముందుగా సీసీ ఫుటేజీని స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శిని, ఇతరులను ప్రశ్నించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మాజీ ఎంపీలు వివేక్, పొంగులేటి సుధాకర్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీగా ఇటీవలే ఎన్నికైన ఎ.వి.ఎన్.రెడ్డి, మాజీ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తూనే మరోవైపు కేసులు ప్రభుత్వమే వేయిస్తూ నిరుద్యోగ యువతను మోసగిస్తోందని ఆరోపించారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, ఇంద్రసేనారెడ్డి, మాజీ మేయర్ కార్తీకరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కుర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ