సంక్షిప్త వార్తలు(5)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి దొరకడం ప్రభుత్వ వైఫల్యమేనని తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు.
అది ప్రభుత్వ వైఫల్యమే?
తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో గంజాయి దొరకడం ప్రభుత్వ వైఫల్యమేనని తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు. అసలు కొండపైకి గంజాయి ఎలా చేరిందని ప్రశ్నించారు. సెక్యూరిటీ అధికారులు ఎలాంటి తనిఖీలు లేకుండా కొండపైకి వాహనాల్ని అనుమతిస్తున్నారని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘‘గంజాయి, మాదకద్రవ్యాల వ్యాపారం, అక్రమ రవాణా అంతా జగన్, వైకాపా వాళ్లే చేస్తున్నారు. గంజాయి సాగులో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఎన్సీబీ నివేదికల ప్రకారం 2018లో 6,600 కిలోల గంజాయి పట్టుబడితే..నేడు 2.06 లక్షల కిలోలను పోలీసులు పట్టుకున్నారు...’’ అని బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడు, సోమిరెడ్డిలకు చంద్రబాబు శుభాకాంక్షలు
ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిలకు తెదేపా అధినేత చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న వీరికి సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం కలగాలని అభిలషిస్తూ ఆదివారం ట్వీట్ చేశారు.
ఎకరాకు రూ.20 వేలు పరిహారం చెల్లించాలి.
మాజీ మంత్రి కేఎస్ జవహర్
ఈనాడు డిజిటల్, అమరావతి: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు చొప్పున నష్టపరిహారంగా చెల్లించి ఆదుకోవాలని మాజీ మంత్రి కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వానలకు పలు జిల్లాల్లోని ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన వరి, మొక్కజొన్న, మిర్చి, మినుము, పెసర, శనగ, వేరుశనగలతో పాటు అరటి, మామిడి, బొప్పాయి, బత్తాయి, నిమ్మ తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాదాపు మూడు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంత జరిగినా మంత్రులు, అధికారులు రైతులను కనీసం పలకరించిన దాఖలాలు లేవు. వ్యవసాయశాఖ మంత్రి పత్తా లేకుండా పోయారు. పక్క రాష్ట్రం తెలంగాణలో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.పది వేలు నష్టపరిహారం ప్రకటించి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అకాల వర్షాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు, వడగండ్ల వాన కారణంగా దెబ్బతిన్న ఆస్తికి పరిహారం చెల్లించాలి. పంట రుణాలను తక్షణం పునరుద్ధరించాలి...’’ అని కేఎస్ జవహర్ పేర్కొన్నారు.
తిరుమల పవిత్రతను కాపాడాలి: ‘‘తిరుమలలో సైతం గంజాయి విక్రయించడాన్ని చూస్తుంటే జగన్ పాలనలో రాష్ట్రం ఎంతలా మత్తులో జోగుతుందో అర్థమవుతోంది. అధికార పార్టీ ప్రతినిధుల ప్రమేయంతోనే గంజాయి వ్యాపారం నడుస్తోంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి తిరుమల పవిత్రతను కాపాడాలి’’ అని కేఎస్ జవహర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మోదీ పరిచయం చేశాకే.. చిరుధాన్యాల వాడకం పెరిగింది
భాజపా రాష్ట్ర కార్యదర్శి రమేశ్నాయుడు
ఈనాడు, అమరావతి: చిరుధాన్యాల విశిష్టతను ప్రధాని మోదీ ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాతే వాటి వాడకం పెరిగిందని భాజపా రాష్ట్ర కార్యదర్శి నాగౌతు రమేశ్నాయుడు పేర్కొన్నారు. మలేసియా కెలంటన్ విశ్వవిద్యాలయ ఆహ్వానం మేరకు అక్కడ జరిగిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జీ-20 సదస్సు ముఖ్య ఉద్దేశాలను వివరించారు. ప్రపంచదేశాలకు సంక్షోభంలో చేయూత ఇవ్వడంతోపాటు ప్రజల ఆరోగ్య సంరక్షణకు భారతదేశం ఎంతో చొరవ చూపిస్తోందని తెలిపారు.
దళిత ఎమ్మెల్యే మాటలను సుమోటోగా తీసుకోండి
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలంటే తనకు భయమేస్తోందంటూ దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలను రాజ్యాంగ సంస్థలు సుమోటోగా తీసుకుని చర్యలు చేపట్టాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘తనను ఆంధ్రప్రదేశ్కు రానివ్వటం లేదంటూ నిన్నటి వరకూ ఒక ఎంపీ మాట్లాడితే నిమ్మకు నీరెత్తినట్లున్న రాజ్యాంగ సంస్థలు, రాజ్యాంగ అధిపతులారా.. ఇప్పుడు ఏపీకి రావాలంటే భయమేస్తోందంటూ ఒక దళిత ఎమ్మెల్యే చెప్పిన మాటలనైనా సుమోటోగా తీసుకోండి. లేదంటే మీ సంస్థలకు తాళాలు వేసి, ఇళ్లకు వెళ్లి పడక కుర్చీలో కూర్చొని.. బజ్జోండి’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. వైకాపా నుంచి సస్పెన్షన్కు గురైన దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన తన ట్వీట్కు జతపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్