క్షేత్రస్థాయికి వెళ్లేలా తెదేపా కార్యాచరణ
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి.. వరుస కార్యక్రమాల నిర్వహణకు పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందిస్తోంది. చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి నేతల వరకు క్షేత్రస్థాయిలో ఉండేలా ప్రణాళిక తయారు చేస్తోంది.
రేపు హైదరాబాద్లో పొలిట్బ్యూరో భేటీ
29న పార్టీ ప్రతినిధుల సభ
ఈనాడు, అమరావతి: తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి.. వరుస కార్యక్రమాల నిర్వహణకు పార్టీ అధిష్ఠానం కార్యాచరణ రూపొందిస్తోంది. చంద్రబాబు నుంచి గ్రామ స్థాయి నేతల వరకు క్షేత్రస్థాయిలో ఉండేలా ప్రణాళిక తయారు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు సంబరాలు, ప్రజా సమస్యలపై పోరాటం, సంస్థాగత కార్యక్రమాల సమాహారంగా నిరంతరం ప్రజల మధ్య ఉండేలా కసరత్తు చేస్తోంది. మార్చి 28న హైదరాబాద్లో పొలిట్బ్యూరో సమావేశం జరగనుంది. సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న ఈ సమావేశంలో.. మహానాడు నిర్వహణ సహా పలు అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మార్చి 29న హైదరాబాద్లో పార్టీ ప్రతినిధుల సభ జరగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే సభకు రెండు రాష్ట్రాల నుంచి తెదేపా నేతలు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పొలిట్బ్యూరో సభ్యులతో పాటు నియోజకవర్గ బాధ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. క్లస్టర్ ఇన్ఛార్జి నుంచి రాష్ట్ర కమిటీ నాయకులు కూడా వీటికి హాజరవుతున్నారు.
ఏప్రిల్లో జోనల్ సమావేశాలు
ఏప్రిల్ మొదటి వారంలో విశాఖ, నెల్లూరు, కడప జిల్లాల్లో పార్టీ జోన్-1, జోన్-4, జోన్-5 సమావేశాలు జరగనున్నాయి. అనంతరం అధినేత చంద్రబాబుతో సహా రాష్ట్ర నాయకత్వం అంతా ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలను సిద్ధం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని ప్రజలతో పంచుకోవడంతో పాటు.. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహణ, ప్రజా సమస్యలపై నియోజకవర్గ, జిల్లా స్థాయి పోరాటాలకు కసరత్తు చేస్తున్నారు. తెదేపా ఇక అన్స్టాపబుల్ అని అధినేత చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడంతో.. అందుకు అనుగుణంగానే పార్టీ కార్యక్రమాలను నిర్వహించేలా రోడ్మ్యాప్ తయారవుతోందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
ఎన్టీఆర్ అందరికీ మార్గదర్శకులు: చంద్రబాబు
ఈనాడు, అమరావతి: నటుడిగా, రాజకీయనాయకుడిగా ఘన విజయాలను సాధించిన ఎన్టీ రామారావు.. అందరికీ మార్గదర్శకులని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆ మహానటుడి ఘనతను చాటి చెప్పేందుకు.. గత అయిదు నెలలుగా ఎన్టీఆర్ శతజయంతి కమిటీ చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. కమిటీ ఛైర్మన్ టీడీ జనార్దన్ సారథ్యంలోని బృందం సభ్యులు ఆదివారం హైదరాబాద్లో చంద్రబాబును కలిసి తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఎన్టీఆర్ వెబ్సైట్తో పాటు శకపురుషుడు అనే ప్రత్యేక సంచిక, శాసనసభలో ఆయన చేసిన ప్రసంగాలతో పుస్తకాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. శతజయంతి వేడుకల్లో భాగంగా విజయవాడలో ప్రసంగాల పుస్తకాలను, హైదరాబాద్లో వెబ్సైట్తో పాటు శకపురుషుడు పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబుకు వివరించారు. ఎన్టీఆర్ను తరతరాలుగా గుర్తుంచుకునేలా వీడియో, వ్యాస రూపంలో ప్రముఖులు, రాజకీయ రంగంలోని వారి అభిప్రాయాలను తీసుకుంటున్నామని చెప్పారు. బృందం సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి, కాట్రగడ్డ ప్రసాద్, కె.రవిశంకర్, విక్రమ్ పూల, భగీరథ, అట్లూరి నారాయణరావు, డి.రామ్మోహన్రావు, మండవ సతీశ్, కె.రఘురామ్, శ్రీపతి సతీశ్, మధుసూదన్రాజు, విజయభాస్కర్, గౌతమ్ బొప్పన తదితరులు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్