ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందేమో...?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారంటే.. ఆ మేరకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందేమోనని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు.
సరిదిద్దుకోవడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నాం: డిప్యూటీ స్పీకర్
విజయనగరం, న్యూస్టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారంటే.. ఆ మేరకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందేమోనని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి వ్యాఖ్యానించారు. సరిదిద్దుకోవడానికి ఇదో అవకాశంగా తాము భావిస్తున్నామని చెప్పారు. సోమవారం విజయనగరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగుకు పాల్పడ్డారని అన్ని విధాలా నిర్ధారించిన తర్వాతే నలుగుర్ని అధిష్ఠానం సస్పెండ్ చేసిందన్నారు. ‘సస్పెండైన వారు పశ్చాత్తాపపడటం లేదు.ఎక్కడో వైద్యవృత్తి చేసుకుంటున్న శ్రీదేవిని తెచ్చి గెలిపించాం. ఆమె ఏనాడూ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కాలేదు. ప్రజల్లో ఆమె పట్ల విశ్వాసం లేదనే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే అక్కడ పార్టీ ఇన్ఛార్జిని మార్చాం...’ అని కోలగట్ల పేర్కొన్నారు. మంత్రి పదవులు ఇవ్వకపోతే పార్టీ మారే ఆనవాయితీ ‘ఆనం’కు ఉందని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఓటేసినా చర్యలు తీసుకుంటామని ఓ ప్రశ్నకు సమాధానంగా కోలగట్ల చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.