ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి: చాడ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ విచారణతో పాటు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి కోరారు.
భగత్నగర్, న్యూస్టుడే: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ విచారణతో పాటు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి కోరారు. సోమవారం కరీంనగర్లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృతస్థాయి కౌన్సిల్ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేపర్ లీకేజీకి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తే.. పెద్ద తలకాయల పేర్లు బయటకొచ్చే అవకాశముందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కాళేశ్వరం జలాలు తప్ప నిధులు, నియామకాల్లో ఆశించిన మేర ఫలితాలు సాధించలేదన్నారు. భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్(బీకేఎంయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క బాలమల్లేశ్, జాతీయ ఉపాధ్యక్షుడు టి.వెంకట్రాములు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోతె లింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె.కాంతయ్య, రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్కుమార్, 32 జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్