40 శాతం టికెట్లు యువతకే
వచ్చే ఎన్నికల్లో 40% టికెట్లను యువతకు కేటాయించాలని తెదేపా పొలిట్బ్యూరో తీర్మానించింది. మే 27, 28 తేదీల్లో పార్టీ మహానాడును రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది.
వచ్చే మహానాడు రాజమహేంద్రవరంలో
ఉభయ తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లో 100 చోట్ల ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
రూ.5వేలు కట్టినవారికి పార్టీ శాశ్వత సభ్యత్వం
తెదేపా పొలిట్బ్యూరో నిర్ణయాలు
ఈనాడు-హైదరాబాద్, అమరావతి: వచ్చే ఎన్నికల్లో 40% టికెట్లను యువతకు కేటాయించాలని తెదేపా పొలిట్బ్యూరో తీర్మానించింది. మే 27, 28 తేదీల్లో పార్టీ మహానాడును రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్ని మే 28 వరకు 100 ప్రాంతాల్లో నిర్వహించనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ స్థానాల్లోను, అండమాన్ నికోబార్ దీవులు, విదేశాల్లో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఎన్నికలకు పార్టీ మేనిఫెస్టో రూపకల్పన, మహానాడుకు సన్నాహాలు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణకు పార్టీ మూడు ప్రత్యేక కమిటీల్ని నియమించనుంది. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్బ్యూరో సమావేశం మంగళవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టుభవన్లో జరిగింది. సుమారు మూడు గంటలు జరిగిన సమావేశంలో... ఆంధ్రప్రదేశ్కు చెందిన 13 అంశాలు, తెలంగాణకు సంబంధించిన నాలుగు అంశాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత ప్రభుత్వాలు అన్నివర్గాల ప్రజల్ని మోసం చేశాయని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని పొలిట్బ్యూరో అభిప్రాయపడింది. విభజన హామీలు నెరవేరేలా చూడటంలో ఇద్దరు ముఖ్యమంత్రులూ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా తెస్తానని యువతను నమ్మించిన జగన్, వారిని దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తింది. ఏపీలో అధికారపార్టీ నాయకుల వేధింపులు, భౌతిక దాడులతో... ఆర్థికంగానూ దెబ్బతిన్న పార్టీ నాయకులు, కార్యకర్తల్ని ఆదుకునేందుకు తెదేపా మద్దతుదారులు, సానుభూతిపరుల నుంచి విరాళాలు సేకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రెండేళ్లకోసారి చేపడుతున్న పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే, రూ.5వేలు, ఆపైన చెల్లించినవారికి శాశ్వత సభ్యత్వం కల్పించాలని పొలిట్బ్యూరో నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాబూ జగ్జీవన్రాం విగ్రహాలను భారీస్థాయిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను డిమాండు చేసింది. తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం వంద రూపాయల నాణేన్ని విడుదల చేయాలన్న కేంద్ర నిర్ణయంపై హర్షం వెలిబుచ్చింది. ఏపీలో ఇటీవల మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, ఎమ్మెల్యేల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానంలో విజేతలను అభినందిస్తూ పొలిట్బ్యూరో తీర్మానం ఆమోదించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని పార్టీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధ్యక్షులు కె.అచ్చెన్నాయుడు, కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్రెడ్డి విలేకర్లకు తెలిపారు. ముఖ్యాంశాలు...
ప్రజల్లోకి మేనిఫెస్టో కమిటీ
పార్టీ మేనిఫెస్టో రూపకల్పన కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తుంది. ఇప్పుడు అందుతున్న సంక్షేమపథకాలకు మించి లబ్ధి చేకూర్చేలా మేనిఫెస్టో ఉండాలని చంద్రబాబు సూచన.
ఇంటింటికీ తెదేపా చరిత్ర
41 సంవత్సరాల తెదేపా ప్రస్థానం నేటి యువతకు తెలియాలి. అందుకోసం పార్టీ చరిత్రను ఇంటింటికీ తెలియజేయాలి. తెదేపా ఆవిర్భావానికి ముందు, తర్వాత తెలుగుజాతి ఎలా ఉందన్న అంశంపై చర్చించాలి. తెదేపా ఆవిర్భావానికి ముందు ప్రజలు ఓట్లేసే యంత్రాలుగానే ఉండేవారు. సామాజిక న్యాయం మచ్చుకైనా కనిపించేది కాదు. తెదేపా వచ్చాకే ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యులు. దశాబ్దాల నుంచి ప్రజల్ని పట్టిపీడిస్తున్న అనేక సమస్యలకు తెదేపా పరిష్కారం చూపింది.
కష్టపడేవారికే అవకాశం
* పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పించాలని, వారి సేవల్ని మెరుగ్గా ఉపయోగించుకోవాలని నిర్ణయం. పైరవీలు చేసేవారికి, ‘ఫొటోగ్రాఫిక్ నాయకత్వానికి’ తావులేకుండా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం.
* పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రపై చర్చ. విజయవంతంగా సాగుతోందని, యువత పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని అభిప్రాయం.
* ఏపీలో ప్రతిపక్షాలు, ప్రజలు, మీడియా తనను ప్రశ్నించకూడదన్న అక్కసుతోనే జగన్ జీవో నం.1 తీసుకొచ్చారని ధ్వజం. ఆ జీవోను తీవ్రంగా ఖండించిన పొలిట్బ్యూరో. జగన్రెడ్డి తన తప్పు అంగీకరించి, లెంపలేసుకుని వెనక్కి తీసుకోవాలని డిమాండు.
రైతుల ముఖం చూడని జగన్
* ఏపీలో అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయినా, ఇప్పటి వరకూ సీఎం జగన్ వారి ముఖం చూడలేదని ధ్వజం. రైతుల్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండు.
* ఏపీలో విద్యుత్ఛార్జీలు విపరీతంగా పెంచేశారని, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, చెత్తపన్ను... ఇతరత్రా పన్నుల పెంపుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ధ్వజం
తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని తెదేపా నిర్ణయించింది. పొలిట్బ్యూరోలో చర్చించిన అంశాల్లో తెలంగాణకు సంబంధించి.. అకాల వర్షాలతో కష్టాల్లో రైతులు, హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యం, ఇంటింటికీ తెదేపా, సభ్యత్వ నమోదు అంశాలున్నాయి. పంటనష్టం గణనలో కాలం చెల్లిన విధానాల్ని పక్కనపెట్టాలని.. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని తెదేపా డిమాండు చేసింది. బయ్యారం, కాజీపేట కోచ్ఫ్యాక్టరీ హామీలు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించాలని, రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ చేపట్టాలని, నిరుద్యోగులకు రూ.3,116 భృతి, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండు చేసింది.
మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ
నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా రూ.100 నాణెం విడుదలకు చొరవ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ప్రధానికి చంద్రబాబు మంగళవారం లేఖ రాశారు. ‘ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఆయన్ను సన్మానించడం అంటే తెలుగువారిని గౌరవించడమే. ఈ సందర్భంగా తెలుగు ప్రజలు, తెదేపాతోపాటు వ్యక్తిగతంగా నా తరఫున మీకు ధన్యవాదాలు’ అని లేఖలో పేర్కొన్నారు.
నేడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆవిర్భావ సభ
తెదేపా 41వ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్లో బుధవారం జరిగే ఈ సభను తెలంగాణ తెదేపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతుంది.
జగన్ అరాచకపాలనతో ఏపీ 30 ఏళ్లు వెనక్కి
* జగన్ పాలన అరాచకంగా ఉందని, అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ధ్వజం. రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టాలంటే తెదేపా అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని అభిప్రాయం. రాష్ట్రానికి గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్టు జగన్ ప్రభుత్వ నిర్వాకంతో చిన్న బ్యారేజీగా మారే పరిస్థితి తలెత్తిందని ధ్వజం
* జగన్ సర్కారు ధనదాహం, దౌర్జన్యాలకు పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆగ్రహం.
* తెదేపా నిర్వహిస్తున్న ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేయాలని నిర్ణయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
తేనీటి వెనక కన్నీటి ధారలు!
మన దేశంలో వేడివేడి ఛాయ్ మజాను ఆస్వాదించనివారు అరుదు. చాలా ఇళ్లలో చుట్టాలకు తొలి పలకరింపు తేనీటితోనే! పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకునేటప్పుడు.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. చాలామందికి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే!! -
12 మందికి నేరచరిత్ర
రాజస్థాన్లో లోక్సభకు పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో కొందరిపై హత్య కేసులూ ఉన్నాయి. -
నవనీత్ రాణా.. ఓ నృత్యకారిణి
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి, సినీనటి నవనీత్ రాణాపై శివసేన(యూబీటీ) నేత సంజయ్రౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి. -
సంక్షిప్త వార్తలు
ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. మోదీ వచ్చాకే ఈ ప్రాంతం మిగిలిన దేశంతో మమేకమైంది. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
ఇది వారణాసి, వయనాడ్ మధ్య పోరాటం
తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీని తాము కోరినా వయనాడ్ వైపే మొగ్గు చూపారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రం వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
రాహుల్ను ప్రధానిని చేయాలి: తుమ్మల
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని... రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను కోరారు. -
మాదిగలకు కాంగ్రెస్ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్లో అమీర్పేట లీలానగర్లోని తన నివాసంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. -
భాజపాను అడ్డుకుంటేనే రేవంత్కు, లౌకికవాదానికి మంచిది
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలని.. కేరళకు వెళ్లి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలపై ఆయన నోరు పారేసుకోవడం సరైంది కాదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
రేవంత్రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు: లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. -
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నాలుగు నెలల్లోనే కర్షకుల ఉసురు పోసుకుంటోందని, వారిని వేదనకు గురిచేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
భాజపాతోనే వికసిత తెలంగాణ: గోవా సీఎం
గత పదేళ్లలో తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ఆరోపించారు. -
ఈటల సేవలు దేశానికి అవసరం
కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. -
రత్నగిరి-సింధుదుర్గ్ భాజపా అభ్యర్థిగా నారాయణ్ రాణె
కేంద్రమంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది. -
భారాస నాయకులను చేర్చుకోవద్దు
భారాస నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్గౌడ్, నాయకుడు శేఖర్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుటే పెట్రోలు పోసుకుని నిరసనకు దిగారు. -
అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోతున్నా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి విముఖత వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు