మే 10న కర్ణాటక ఎన్నికలు
కర్ణాటక శాసనసభ ఎన్నికలు మే 10న ఒకే దశలో జరగనున్నాయి. ఫలితాలను అదే నెల 13న వెలువరిస్తారు.
224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్
అదే నెల 13న ఫలితాలు: ఈసీ
వయనాడ్పై తొందర లేదన్న రాజీవ్కుమార్
దిల్లీ: కర్ణాటక శాసనసభ ఎన్నికలు మే 10న ఒకే దశలో జరగనున్నాయి. ఫలితాలను అదే నెల 13న వెలువరిస్తారు. పంజాబ్లోని జలంధర్ లోక్సభ స్థానానికి, వేర్వేరు రాష్ట్రాల్లోని 4 శాసనసభ స్థానాలకు కూడా అదే రోజు ఎన్నికలు జరగనున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ బుధవారం ప్రకటించారు. ఏప్రిల్ 13న నోటిఫికేషన్ జారీ చేసి, అదేనెల 20వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు స్వీకరిస్తామని తెలిపారు. సోమవారం, శుక్రవారాల్లో కాకుండా బుధవారం ఎన్నికలు జరిగేలా తేదీని నిర్ణయించినట్లు చెప్పారు. తద్వారా ఎక్కువమంది ఓటర్లు ముందుకు వచ్చేలా ప్రోత్సహించనున్నామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చిందనీ, దీనికంటే ముందే తమ ఆదేశాల మేరకు వివిధ విభాగాలు కర్ణాటకపై కన్నువేసి ఇంతవరకు రూ.80 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నాయని సీఈసీ వివరించారు. థర్డ్ జెండర్ వాళ్లు ఆ విషయాన్ని ఓటర్ల జాబితాలో చేర్చకూడదని కోరుకుంటారని, దానిలో సున్నితత్వం దృష్ట్యా వారు స్త్రీలుగా గానీ, పురుషులుగా గానీ ఎలా నమోదు చేయమంటే అలా చేసేందుకు సుముఖత వ్యక్తంచేశామని వివరించారు.
రాజకీయ వర్గాల్లో ఆసక్తి
సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాదే జరగనుండడంతో కర్ణాటక అసెంబ్లీ సమరంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ సమరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 224 స్థానాలున్న అసెంబ్లీలో ప్రస్తుతం భాజపా 119, కాంగ్రెస్ 75, జేడీ(ఎస్) 28 సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
వయనాడ్పై వేచిచూస్తాం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడడంతో కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయినట్లు లోక్సభ సచివాలయం ఇటీవలే ప్రకటించింది. దీనిపై సీఈసీ స్పందించారు. ‘వయనాడ్ ఉపఎన్నిక ప్రకటించడానికి తొందర లేదు. రాహుల్ అప్పీల్ చేసుకోవడానికి న్యాయస్థానం నెలరోజుల గడువు ఇచ్చింది. మేం వేచిచూసి, ఆ తర్వాత స్పందిస్తాం’ అని రాజీవ్ కుమార్ వెల్లడించారు. చట్ట ప్రకారమే ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించామని, ఆరు నెలల్లో దానికి ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. మిగిలిన పదవీకాలం సంవత్సరంలోపే ఉంటే అప్పుడు ఎన్నిక నిర్వహించాల్సిన పని లేదని, వయనాడ్ విషయంలో అది ఏడాదికి మించి ఉందని వివరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సమర్థతపై రాజకీయ పార్టీలను ఒప్పించాల్సిన బాధ్యత తమదేనన్నారు. వాటి విశ్వసనీయతను ప్రశ్నించిన పార్టీలకు అనుకూలంగానూ ఈవీఎంలలో ఫలితాలు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
ఖాళీ స్థానాలకు ఉప ఎన్నికలు
ఒక లోక్సభ స్థానానికి, నాలుగు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా మే 10నే జరగనున్నాయని ఈసీ తెలిపింది. పంజాబ్లోని జలంధర్ లోక్సభ స్థానం, ఒడిశాలోని ఝార్సుగుడ, ఉత్తర్ప్రదేశ్లోని స్వార్, అదే రాష్ట్రంలోని ఛాన్బే, మేఘాలయలోని సొహియాంగ్ నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి.
కర్ణాటకలో ‘ఇంటినుంచే ఓటు’ అమలు
ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలో తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. రాష్ట్రంలో శతాధిక వృద్ధులే 16,976 మంది ఉన్నారు. ‘ఓట్ ఫ్రం హోం’ సదుపాయం ద్వారా మొత్తం 17.21 లక్షల మంది ఓటు వేసే అవకాశం కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. -
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను జైపుర్లో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
భారతదేశపు సంపన్న మహిళ సావిత్రి జిందాల్ (Savitri Jindal), బిజేడీ నుంచి 6 సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి భాజపాలో చేరారు. -
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరనున్నారు. -
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. -
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్