సొంత పనుల కోసమే సీఎం దిల్లీ యాత్రలు
‘గత నాలుగేళ్లలో ఒక్క కాలువ కూడా తవ్వలేదు. సాగునీటికి బడ్జెట్లో సరైన కేటాయింపులూ చేయలేదు. ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేని ఎంపీలు మనకున్నారు.
ఒంగోలు సదస్సులో కాంగ్రెస్, వామపక్షాల నేతలు
ఈనాడు డిజిటల్, ఒంగోలు: ‘గత నాలుగేళ్లలో ఒక్క కాలువ కూడా తవ్వలేదు. సాగునీటికి బడ్జెట్లో సరైన కేటాయింపులూ చేయలేదు. ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వానికి కనీసం వినతిపత్రం కూడా ఇవ్వలేని ఎంపీలు మనకున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తమ్ముడిని కాపాడుకునేందుకు, తన సొంత పనులు చక్కదిద్దుకునేందుకు మాత్రమే ముఖ్యమంత్రి జగన్ తరచూ దిల్లీ యాత్రలు సాగిస్తుంటారు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి- వెలిగొండ ప్రాజెక్టు’ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. సీఎం సొంత జిల్లాలోని గండికోటలో 26 టీఎంసీల నీళ్లు ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వడానికి కాలువలు లేకపోవడం శోచనీయమన్నారు. సమస్యల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి పోరాటం చేయనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి మాట్లాడుతూ..ఎగువ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోకుంటే రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. కృష్ణానదీ జలాల నిర్వహణ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. 26 జిల్లాల్లోనూ సాగునీటి పారుదల ప్రాజెక్టులపై సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. సదస్సులో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!