కోనసీమ కేసుల ఎత్తివేత దారుణం
కోనసీమ అల్లర్ల కేసులను కేసులను ఎత్తివేయడం దారుణమని, ఇది ఎంతవరకు సమంజసమని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్కుమార్ ప్రశ్నించారు.
జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్కుమార్
ఈనాడు, అమరావతి: కోనసీమ అల్లర్ల కేసులను కేసులను ఎత్తివేయడం దారుణమని, ఇది ఎంతవరకు సమంజసమని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రావణ్కుమార్ ప్రశ్నించారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టడం ప్రభుత్వానికే ఇష్టం లేక.. ఉద్దేశపూర్వకంగానే అల్లర్లు, మారణహోమం జరిగేలా చేశారన్నారు. ‘కేసులు ఎత్తేయడానికి ఇది జగన్ సొంత రాజ్యం కాదు. రాజ్యాంగం ప్రకారమే కేసుల ఉపసంహరణ జరగాలి’ అన్నారు. కేసుల ఎత్తివేతపై తాము న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఖండించాలన్నారు. కేసుల ఎత్తివేతపై సీఎం చేసిన ప్రకటన జీవో రూపం దాలిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శ్రావణ్కుమార్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Brij Bhushan Singh: రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్ భూషణ్ ఇంటికి దిల్లీ పోలీసులు
-
General News
Polavaranm-CM Jagan: పోలవరంలో సీఎం జగన్ పర్యటన
-
World News
Ukraine: ఉక్రెయిన్పై భారీ దాడి.. నోవా కఖోవ్కా డ్యామ్ పేల్చివేత..!
-
India News
Abhishek Banerjee: నన్ను, నా భార్యాపిల్లల్ని అరెస్టు చేసినా.. తలవంచను..: అభిషేక్ బెనర్జీ
-
Sports News
Shubman Gill: అతడి ప్రశంసలకు గిల్ పూర్తి అర్హుడు: పాక్ మాజీ కెప్టెన్
-
World News
USA: మీరు దిల్లీ వెళ్లి చూడండి.. భారత్ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: అమెరికా