Raghurama: ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రయత్నం: రఘురామ
రాష్ట్రంలో పడిపోతున్న తమ పార్టీ గ్రాఫ్ చూసి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో పడిపోతున్న తమ పార్టీ గ్రాఫ్ చూసి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తెలంగాణతో పాటే ముందస్తు ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉందన్నారు. ఇక్కడ బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన, పోలవరం పెండింగ్ బిల్లుల కోసమే ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన అని పైకి చెబుతున్నా... అసలు కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో జైలులో ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్, కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లకుండా కాపాడడం కోసమే ఆయన దిల్లీ పర్యటన చేపడుతున్నారని రఘురామ ఆరోపించారు. అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లినా అంతిమ విచారణ తమపైకి రాకుండా చూసుకోవాలని కేంద్ర పెద్దలను ముఖ్యమంత్రి కోరే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయన్నారు. తాను అనుకుంటున్న వారిని అరెస్టు చేసి ఆనందించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, దానికి కేంద్రం అనుమతి కోసమే దిల్లీ పర్యటన అని తెలుస్తోందని రఘురామ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అరెస్టులకు కేంద్రం నుంచి అనుమతి అవసరం లేకపోయినా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ