Raghurama: ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రయత్నం: రఘురామ
రాష్ట్రంలో పడిపోతున్న తమ పార్టీ గ్రాఫ్ చూసి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
ఈనాడు, దిల్లీ: రాష్ట్రంలో పడిపోతున్న తమ పార్టీ గ్రాఫ్ చూసి ముందస్తుగా ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తెలంగాణతో పాటే ముందస్తు ఎన్నికల నిర్వహణకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కోరే అవకాశం ఉందన్నారు. ఇక్కడ బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా సాధన, పోలవరం పెండింగ్ బిల్లుల కోసమే ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన అని పైకి చెబుతున్నా... అసలు కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో జైలులో ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్, కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లకుండా కాపాడడం కోసమే ఆయన దిల్లీ పర్యటన చేపడుతున్నారని రఘురామ ఆరోపించారు. అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లినా అంతిమ విచారణ తమపైకి రాకుండా చూసుకోవాలని కేంద్ర పెద్దలను ముఖ్యమంత్రి కోరే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయన్నారు. తాను అనుకుంటున్న వారిని అరెస్టు చేసి ఆనందించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని, దానికి కేంద్రం అనుమతి కోసమే దిల్లీ పర్యటన అని తెలుస్తోందని రఘురామ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అరెస్టులకు కేంద్రం నుంచి అనుమతి అవసరం లేకపోయినా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని జగన్మోహన్రెడ్డి భావిస్తున్నారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్