నడ్డా నేటి పర్యటన రద్దు

భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా శుక్రవారం సంగారెడ్డిలో పార్టీ కార్యాలయాన్ని వర్చువల్‌గా దిల్లీ నుంచి ప్రారంభిస్తారని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated : 31 Mar 2023 06:20 IST

వర్చువల్‌గా సంగారెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా శుక్రవారం సంగారెడ్డిలో పార్టీ కార్యాలయాన్ని వర్చువల్‌గా దిల్లీ నుంచి ప్రారంభిస్తారని పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. భాజపా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన దిల్లీ నుంచి ప్రసంగిస్తారని తెలిపింది. నడ్డా శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చి సంగారెడ్డి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా ఆయన పర్యటన రద్దయినట్లు ఆ ప్రకటనలో వెల్లడించింది. కాగా సంగారెడ్డిలో భాజపా కార్యాలయం ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు తరుణ్‌ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, ముఖ్య నేతలు శివచరణ్‌, కె.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని