వివేకా హత్య కేసు నుంచి బయటపడేందుకు అమిత్షాతో జగన్ ఒప్పందం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు చేరుకోవడంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దిల్లీకి పరుగులు పెడుతున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
తిరుపతి (నగరం), న్యూస్టుడే: ‘మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు చేరుకోవడంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దిల్లీకి పరుగులు పెడుతున్నారు. కేసు నుంచి బయట పడేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తిరుపతిలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కేసులో శిక్ష తప్పదని భావించిన ముఖ్యమంత్రి త్వరలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో వంద సీట్లలో భాజపా అభ్యర్థులను గెలిపించేలా చేస్తానని అమిత్షాకు మాట ఇచ్చారు. సీఎం సంపాదించిన అక్రమ ఆస్తులన్నీ కర్ణాటక ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల కోసం ఖర్చు చేయబోతున్నారు. భాజపాతో ఆయన చేసుకున్న ఒప్పందం కారణంగా వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు మరింత ఆలస్యం కాబోతుంది’ అని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. దేశం నుంచి లండన్కు పారిపోయిన లలిత్ మోదీ.. రాహుల్గాంధీపై అక్కడ కేసు పెట్టి కోర్టుకు పిలిపిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోదీకి ఆర్థిక నేరగాళ్ల మద్దతు ఉందని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని నారాయణ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?