Nara Lokesh: అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించాం
తెదేపా అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేసి సత్ఫలితాలు సాధించామని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
3 ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుచేశాం
అనంతపురానికి ‘కియా’ తెచ్చి ఉద్యోగాలు కల్పించాం
యువగళం పాదయాత్రలో లోకేశ్
ఈనాడు డిజిటల్, అనంతపురం: తెదేపా అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేసి సత్ఫలితాలు సాధించామని పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటుచేసి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏంటో చేసి చూపించామన్నారు. యువగళం పాదయాత్ర గురువారం పెనుకొండ సమీపంలోని కియా పరిశ్రమ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ‘తెదేపా హయాంలో అనంతపురం జిల్లాను మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేశాం. కడపకు ఉక్కు పరిశ్రమ, కర్నూలుకు సిమెంటు పరిశ్రమ, సోలార్ పార్కులు, చిత్తూరుకు ఎలక్ట్రానిక్స్, ప్రకాశం జిల్లాకు పేపర్మిల్లు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు రాజధాని, ఉభయగోదావరి జిల్లాలకు ఫిషరీస్, ఫార్మా, డిఫెన్స్, ఉత్తరాంధ్రకు ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం. అన్ని జిల్లాలకు ప్రాధాన్యమిచ్చాం. రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉండాలి.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనేదే తెదేపా నినాదం’ అని పేర్కొన్నారు. చంద్రబాబు మరో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. కియా పరిశ్రమ వల్ల అనంతపురం జిల్లాలో తలసరి ఆదాయం రూ.30 వేలు పెరిగిందని వివరించారు. మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లవుతోందని, ఇటుక అయినా పేర్చారా? అని లోకేశ్ ప్రశ్నించారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో భాగంగా అనంతపురం వచ్చిన జగన్.. కియాను నకిలీ కంపెనీ అన్నారు. అధికారంలోకి వచ్చాక వైఎస్ రాజశేఖరరెడ్డి కారణంగానే కియా వచ్చిందంటూ అసెంబ్లీ వేదికగా ప్రచారం చేశారు. కియా నకిలీదో.. నిజమైనదో జగన్ చెప్పాలి’ అని లోకేశ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ పెనుకొండ నియోజకవర్గంలో చేసిన ప్రసంగం వీడియోను ప్రదర్శించారు. కియా కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు తీసుకుందంటూ అప్పట్లో ఆరోపించారని.. కానీ ఇప్పుడు అవే భూముల్లో కియా పరిశ్రమ వచ్చి వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చాయి కదా అంటూ జగన్ను ప్రశ్నించారు లోకేష్. తాము అధికారంలోకి వచ్చాక ఏటా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలనిస్తామని, స్వయం ఉపాధిలో భాగంగా యువతను ప్రోత్సహించి ఉపాధి కల్పిస్తామని.. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని’ వెల్లడించారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, అమరనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నాయకులు శ్రీరామ్, పార్థసారథి, గుండుమల తిప్పేస్వామి, సవిత, వెంకటశివుడు యాదవ్ తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు సహకారంతోనే ప్రయోజకులమయ్యాం..
పెనుకొండ పట్టణం, న్యూస్టుడే: తమ తండ్రిని నాడు ప్రత్యర్థులు కడతేర్చగా.. తమ కుటుంబాన్ని తెదేపా, ఎన్టీఆర్ ట్రస్టు అక్కున చేర్చుకుని ప్రయోజకులను చేసిందని నారా లోకేశ్కు యువకుడు సాయిచరణ్ వివరించారు. లోకేశ్ విడిది ప్రాంతానికి ఆయన కుటుంబీకులతో వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. సాయిచరణ్ కుటుంబీకుల కథనం ప్రకారం.. 2004లో నాటి వైఎస్ఆర్ మనుషులు కురుబవాండ్లపల్లికి చెందిన తెదేపా కార్యకర్త మదన్మోహన్ను హతమార్చారు. ఆయన భార్యతోపాటు కుమారులు సాయిచరణ్, మోహన్ భవిష్యత్తు అగమ్యమైంది. పిల్లల బాధ్యతలను తెదేపా స్వీకరించి ఎన్టీఆర్ ట్రస్టు విద్యాలయాల్లో చేర్చింది. సాయిచరణ్కు ఇంటర్ వరకు ఉచిత విద్య, వసతి కల్పించింది. బీటెక్ చదవడానికి సహకరించింది. ప్రస్తుతం సాయిచరణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు విద్యాలయాల్లోనే ఇంటర్ చదివిన మోహన్ ప్రస్తుతం ఎంబీఏ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.