ప్రతి జిల్లాలో నిరుద్యోగ మార్చ్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ప్రతిజిల్లాలో అయిదు వేల నుంచి 10 వేల మందితో నిరుద్యోగ మార్చ్ చేపడతామని, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై ఆందోళనలు ఉద్ధృతం
ప్రజల్లోకి భారాస వైఫల్యాలు
పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి వేర్వేరు కార్యక్రమాలు
భాజపా విస్తృతస్థాయి సమావేశంలో బండి సంజయ్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ప్రతిజిల్లాలో అయిదు వేల నుంచి 10 వేల మందితో నిరుద్యోగ మార్చ్ చేపడతామని, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా విస్తృత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ అధ్యక్షతన భాజపా విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జులు తరుణ్ఛుగ్, సునీల్ బన్సల్, సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్, ముఖ్యనేతలు పొంగులేటి సుధాకర్రెడ్డి, జి.ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్కుమార్, బంగారు శ్రుతి పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డిని సన్మానించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ... ‘టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై అసెంబ్లీ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేయాలి. ఏప్రిల్ 5 నాటికి పోలింగ్ బూత్ కమిటీల నియామకం వంద శాతం పూర్తి చేయాలి. ఆయా కమిటీలతో ప్రధాని నేరుగా మాట్లాడనున్నారు. 6న భాజపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి పోలింగ్ బూత్లో పార్టీ పతాకావిష్కరణ చేయాలి. 8న ప్రధాని రాక నేపథ్యంలో చేపట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. 10న బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ను పూర్తి చేయాలి. 6న పులే, 14న అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించాలి. న్యాయవాది వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 6నుంచి 14వరకు రోజుకో కార్యక్రమం ఉంటుంది. 30న జరిగే ప్రధాని మోదీ మన్కీబాత్ వందో ఎపిసోడ్ను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వంద మందికి తగ్గకుండా జనంతో వంద సెంటర్లలో నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మే నెలంతా విస్తృతంగా ప్రచారం చేయాలి. మే రెండో వారంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 500 మంది క్రియాశీలక కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించాలి. జూన్ 1నుంచి ఇంటింటికీ భాజపా కార్యక్రమంచేపట్టి.. భారాస ప్రభుత్వ వైఫల్యాలపై ప్రచారం చేయాలి’అని పేర్కొన్నారు.
ఆరోపణలు తిప్పికొట్టాలి
కిషన్రెడ్డి
ప్రధాని మోదీ తెలంగాణలో నెలకు ఒకసారైనా అధికారికంగా పర్యటించాలని భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ‘కేంద్రంపై భారాస చేస్తున్న ఆరోపణలను బలంగా తిప్పికొట్టాలి. ఏప్రిల్ 8న హైదరాబాద్కు వస్తున్న ప్రధాని రూ.13,500 కోట్లతో చేపట్టిన వివిధ పనులను ప్రారంభిస్తారు. ఎనిమిదిన్నరేళ్లుగా కేంద్రం తెలంగాణలో ఏయే కార్యక్రమాలకు ఎంత ఖర్చు పెట్టిందనే పూర్తి వివరాలతో రూపొందించిన పుస్తకాన్ని త్వరలో విడుదల చేస్తాం’ అని వివరించారు. పార్టీలో చేరికలపై దృష్టి సారించాలని శివప్రకాశ్ సూచించారు.
సంస్థాగత ఎన్నికల తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడి మార్పు
తరుణ్ఛుగ్
సంస్థాగత ఎన్నికల తర్వాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందని భాజపా రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ఛుగ్ స్పష్టంచేశారు. శుక్రవారం రాత్రి మీడియాతో ఆయన మాట్లాడుతూ... త్వరలోనే విజయసంకల్ప యాత్రల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. లిక్కర్ మాఫియాతో కేసీఆర్ కుటుంబానికున్న బంధం బయటపడిందని, కేసీఆర్ సర్కారు మునిగిపోయే నావ లాంటిది అని అభివర్ణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. -
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. -
అంబటి, అనిల్కుమార్లపై సీఈఓకు తెదేపా ఫిర్యాదు
ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్కుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే