వైకాపా కార్యకర్తలు నన్ను తీవ్రంగా కొట్టారు
‘‘నేడు దగాపడ్డ రైతులు-దోపిడీకి గురవుతున్న ఆంధ్ర పౌరులు అనే పేరుతో మందడంలో నిర్వహించిన కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి మరో నాయకుడు వల్లూరి జయప్రకాష్ నారాయణను ఆహ్వానించారు.
గుంటూరు డీఐజీకి బీజేవైఎం నేత సురేష్ ఫిర్యాదు
ఈనాడు, అమరావతి: ‘‘నేడు దగాపడ్డ రైతులు-దోపిడీకి గురవుతున్న ఆంధ్ర పౌరులు అనే పేరుతో మందడంలో నిర్వహించిన కార్యక్రమానికి భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి మరో నాయకుడు వల్లూరి జయప్రకాష్ నారాయణను ఆహ్వానించారు. వారు ఆ సభకు హాజరై తిరిగి వెళుతుండగా మందడం గ్రామం బయట మూడు రోడ్ల కూడలిలో పోలీసు రోప్ పార్టీ, వైకాపా కార్యకర్తలు మా నేతల వాహనాలను ఆపారు. మా(భాజపా) కార్యకర్తలు దిగి ఇది అన్యాయం అని మాట్లాడుతున్న సమయంలో వెనుక నుంచి పెద్ద సంఖ్యలో అమరావతికి మద్దతు తెలిపేవారిని ఊరుకునే పనిలేదు.. మీ అంతు చూస్తాం అని అంటూ వైకాపా కార్యకర్తలు నన్ను తీవ్రంగా కొట్టి, చంపే ప్రయత్నం చేశారు’’ అని బీజేవైఎం మాజీ జాతీయ కార్యదర్శి, ఎస్సీ నాయకుడు పనతల సురేష్ గుంటూరు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ప్రతిని ఆయన తరఫున భాజపా నాయకుడు వల్లూరి జయప్రకాష్నారాయణ శుక్రవారం రాత్రి గుంటూరులో డీఐజీ త్రివిక్రమ వర్మకు అందజేశారు.
ఆ ఫిర్యాదులో సురేష్ ఏమన్నారంటే...
‘వైకాపా కార్యకర్తలు నన్ను తీవ్రంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారు. నేను కారులో ఎక్కి దాక్కుంటే కర్రలతో చితకబాదారు. కర్రలు, మారణాయుధాలతో మాపై మూకుమ్మడి దాడి చేశారు. మా కారును ధ్వంసం చేశారు. అమరావతి అంటే నరికేస్తాం అంటూ నన్ను, మిగిలిన వారి ప్రాణాలకు ముప్పు కలిగించేలా వైకాపా కార్యకర్తలు వ్యవహరించారు. సత్యకుమార్, ఆదినారాయణరెడ్డిలు ఎక్కడని ప్రశ్నిస్తూ దుర్భాషలాడారు. భాజపా ఓబీసీ నేత కాశయ్య యాదవ్నూ కొట్టారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకొని వేడుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
వైకాపా నాయకులను అడ్డుకుంటాం
- వల్లూరి జయప్రకాష్ నారాయణ, భాజపా నాయకుడు
మూడు రాజధానుల పేరుతో వైకాపా దాడికి పాల్పడింది. ఇది భాజపాపై జరిగిన దాడి. దీన్ని మా పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దాడిని నిరసిస్తూ శనివారం అన్ని కలెక్టరేట్ల ముందు నిరసనలకు పిలుపునిచ్చాం. ఎంపీ సురేష్ ఆధ్వర్యంలోనే మాపై దాడి జరిగింది. దీనికి వైకాపా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి: అచ్చెన్నాయుడు
ఈనాడు, అమరావతి: సత్యకుమార్ వాహనంపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు డిమాండు చేశారు. ‘మూడు రాజధానులన్న ముఖ్యమంత్రి జగన్కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత చెంప పగలగొట్టింది. అయినా ఆయన తీరు మారలేదు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెండు చెంపలు వాయించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.
* వైకాపా కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెదేపా మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పేర్కొన్నారు. ‘జాతీయ పార్టీ నేతలకూ రాష్ట్రంలో రక్షణ కరవైంది. ఇక సామాన్యుల పరిస్థితేమిటి?’ అని ప్రశ్నించారు.
* ‘సత్యకుమార్ వాహనశ్రేణిపై అధికార పార్టీ దన్నుతో కొందరు గూండాలు దాడి చేయడం హేయం. హింసను ప్రోత్సహించే వారు ఎప్పటికైనా పతనమవుతారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతే ఉంటుంది’ అని కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి పేర్కొన్నారు.
* వైకాపా గూండాలు సత్యకుమార్పై దాడి చేయడం నీచమని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పార్థసారథి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుశ్చర్యలకు తావు లేదని, గుండాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
* సత్యకుమార్ వాహనంపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడడం దుర్మార్గమని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ధ్వజమెత్తారు. దాడికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
* దాడి సంఘటనఫై సమగ్రంగా విచారించాలని ప్రధాని నరేంద్ర మోదీకి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్ మార్గదర్శకత్వంలోనే వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని తెలిపారు.
* పోలీసులు, వైకాపా నేతలు పక్కా ప్రణాళికతో భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ