మంత్రి సమావేశం.. గేటుకు తాళం
శ్రీకాకుళం టౌన్హాల్లో శనివారం వైఎస్సార్ ఆసరా మూడో విడత నగదు పంపిణీ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు.
దాన్ని తీసినవాడి గూబ మీద కొట్టండంటూ ధర్మాన అసహనం
శ్రీకాకుళం నగరం, న్యూస్టుడే: శ్రీకాకుళం టౌన్హాల్లో శనివారం వైఎస్సార్ ఆసరా మూడో విడత నగదు పంపిణీ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇటీవల నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరవుతున్న మహిళలు మంత్రి ప్రసంగానికి ముందే తిరిగి వెళ్లిపోతుండటంతో శనివారం టౌన్హాల్ ప్రాంగణంలోని మూడు గేట్లకు అధికారులు తాళాలు వేశారు. మంత్రి ధర్మాన ప్రసంగిస్తున్నప్పుడు ఓ గేటు తాళం ఎవరో తీయడంతో మహిళలు పెద్ద సంఖ్యలో బయటకు వెళ్లిపోయారు. గమనించిన ఆయన ‘ఏయ్ ఆ గేటు తాళాలు ఎవడు తీశాడు? వాడి గూబ మీద ఒకటి కొట్టండి’ అంటూ వేదిక వద్దనున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఈ గేట్ల వద్ద సిబ్బంది ఉండి సమావేశానికి వచ్చేవారిని లోపలికి పంపారు. మంత్రి వచ్చాక అన్ని గేట్లకు తాళాలేసేశారు. ఈ క్రమంలో కొందరు మహిళలు మంత్రి ప్రసంగానికి ముందే గోడలు దూకి వెళ్లిపోయారు. వెళ్లలేనివారు బంధించడం ఇదేం పద్ధతంటూ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చినవారు లోపలికి వెళ్లే అవకాశం లేక కాసేపు నిరీక్షించి ఇంటిముఖం పట్టారు. ‘10 నిమిషాల్లో గేట్లకు తాళాలు తీసేస్తాం. సహకరించండి’ అంటూనే మంత్రి ప్రసంగం ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ