Nara Lokesh: స్టిక్కర్ సీఎం.. జగన్
సీఎం జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమని.. ప్రచారం తప్ప ప్రభుత్వం పనిచేయడం లేదని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు.
ప్రచారం తప్ప అభివృద్ధి శూన్యం
యువగళం పాదయాత్రలో లోకేశ్ ధ్వజం
ఈనాడు డిజిటల్, అనంతపురం: సీఎం జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమని.. ప్రచారం తప్ప ప్రభుత్వం పనిచేయడం లేదని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రూ.వెయ్యి దాటిన ఏ చికిత్సకైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని ప్రచారం చేశారు.. అది ఎక్కడైనా అమలవుతోందా అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో దూది, మందులకు కూడా నిధులు లేవన్నారు.. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అని కొత్తగా డ్రామా మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. యువగళం పాదయాత్ర 68వ రోజు బుధవారం తాడిపత్రి నియోజకవర్గం పసలూరు నుంచి కొనసాగింది. రాయలచెరువులో జరిగిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. ఎవరో చేసిన పనిని తానే చేశానని చెప్పుకోవడం జగన్కే చెల్లిందన్నారు. తెదేపా హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకు వైకాపా రంగులేసి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జగనన్న నువ్వే మా నమ్మకం అనే స్టిక్కర్ అతికించడానికి వెళితే... సొంత తల్లి, చెల్లి నమ్మలేదు, మేమేలా నమ్ముతామని జనం ప్రశ్నిస్తున్నారన్నారు. జగన్ స్టిక్కర్ సీఎంలా మారారని ఎద్దేవా చేశారు. ఆనాడు మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పి.. ఇప్పుడు మద్యం ఆదాయం పైనే అప్పులు చేసిన వ్యక్తిని ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఇంట్లో పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్న జగన్ను ఎందుకు నమ్మాలన్నారు. తాను జగన్లా మాట తప్పే వ్యక్తిని కాదని.. తెదేపా అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పన్నుల భారాన్ని తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పిస్తామన్నారు.
నాలుగేళ్లలో రెడ్లకు దక్కింది అవమానాలే..
జగన్ పాలనలో ప్రభుత్వ కాంట్రాక్టులు చేసిన రెడ్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గం తూట్రాలపల్లి గ్రామంలో రెడ్డి సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. రాజకీయాల్లో రాజనీతి ఉండాలని.. లక్ష్మణరేఖ దాటకూడదని అన్నారు. తెదేపా హయాంలో రెడ్లపై అక్రమ కేసులు పెట్టి ఏనాడు వేధించలేదని చెప్పారు. జగన్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్లు మొత్తం బాధితులేనన్నారు. కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని, మిగిలిన వారికి కనీసం సీఎం అపాయింట్మెంట్ దక్కడంలేదని పేర్కొన్నారు. గతంలో రాజశేఖర్రెడ్డి, చంద్రబాబు ఏనాడూ వ్యక్తిగత దూషణలకు దిగలేదన్నారు. అప్పట్లో జేసీ ప్రభాకర్రెడ్డి.. ఎన్టీఆర్పై పోటీ చేసినా ఆయనను రాజకీయ ప్రత్యర్థిగానే చూశామని తెలిపారు. కానీ నేడు మాత్రం ప్రత్యర్థి ఇంటికెళ్లి రెచ్చగొట్టే ఫ్యాక్షన్ తాడిపత్రిలో జరుగుతోందన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలు.. అవమానాలు, దాడులు, హత్యలు, అక్రమ కేసులకు గురవుతున్నాయన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. దామాషా ప్రకారం రెడ్డి కార్పొరేషన్కు నిధులు కేటాయించి ఆదుకుంటామన్నారు. పాదయాత్రలో మాజీ మంత్రులు అమర్నాథ్రెడ్డి, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్, జేసీ ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, మాజీ జడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు, తాడిపత్రి, కల్యాణదుర్గం నియోజకవర్గాల ఇన్ఛార్జులు జేసీ అస్మిత్రెడ్డి, ఉమామహేశ్వరనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
₹1,823 కోట్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. శనివారం (మార్చి 30న) దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరింది. -
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు
తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. -
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్