Ganta Srinivasa Rao: వైకాపా ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాలి: గంటా శ్రీనివాసరావు

వైకాపా ప్రభుత్వం ఇక నుంచి రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం విశాఖలోని తెదేపా కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.

Updated : 21 Apr 2023 07:46 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఇక నుంచి రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గురువారం విశాఖలోని తెదేపా కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ‘అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజలను మరోసారి మోసగించేందుకు సిద్ధమవుతోంది. నాలుగేళ్ల పాలనలో ఒక్క ఇటుక వేయలేకపోయారు. కానీ, ఎన్నికల ఏడాదిలో పోర్టు, ఎయిర్‌పోర్టు కడతానంటూ మాటలు చెబుతున్నారు’ అని దుయ్యబట్టారు. పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు తాను ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివించనున్నట్లు గంటా తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని