Nara Lokesh: భూహక్కు కాదు.. భూభక్ష పథకమది
‘జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన శాశ్వత భూసర్వేతో ప్రతి రైతు భూమి తగ్గుతోంది. అది భూహక్కు పథకం కాదు.. భూభక్ష పథకం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.
ప్రతి రైతు భూవిస్తీర్ణం తగ్గుతోంది
తగాదాలు పెట్టి బాగుపడదామనుకుంటున్నారు
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఈనాడు, కర్నూలు: ‘జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన శాశ్వత భూసర్వేతో ప్రతి రైతు భూమి తగ్గుతోంది. అది భూహక్కు పథకం కాదు.. భూభక్ష పథకం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ముగిసి ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. నియోజకవర్గ పార్టీ బాధ్యుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం సాయంత్రం వర్షంలోనూ పాదయాత్ర కొనసాగింది. మాచాపురంలో నిర్వహించిన ‘రైతులతో ముఖాముఖి’లో లోకేశ్ మాట్లాడారు. రైతుల మధ్య తగాదాలు పెడితేనే తాము బాగుపడతామన్న ఆలోచనలో వైకాపా నేతలున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా రైతుల ఆధ్వర్యంలో ఉన్న భూములను భూసర్వే పేరుతో లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. భూవిస్తీర్ణం తగ్గించి పాసు పుస్తకం ఇస్తున్నారని మంత్రులే చెబుతున్నారని గుర్తు చేశారు. పాసు పుస్తకాలు, హద్దురాళ్లపైనా జగన్ తన బొమ్మలు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గురురాఘవేంద్ర పథకానికి సంబంధించిన మోటారు మరమ్మతు చేయించడం లేదని, ఫలితంగా ఒక్క టీఎంసీ నీరూ ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో తనను కలిసిన మహిళలు తమకు ఒక్క బొట్టు తాగునీరందించాలని కోరుతున్నారంటే గ్రామాల్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రైతు భరోసా కింద రూ.12,500 ఇస్తామని రూ.7,500 మాత్రమే ఇస్తున్నారని, ఇలా ఒక్కో రైతు నుంచి వేలు కొట్టేశారని ఆరోపించారు. రూ.3,500 కోట్లతో ఏర్పాటుచేస్తామన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. వ్యవసాయ మంత్రికి సీబీఐ చుట్టూ తిరగడమే సరిపోతోందని, రైతు సమస్యల పరిష్కారానికి సమయం చాలడం లేదని ఎద్దేవా చేశారు. తెదేపా అధికారంలోకి రాగానే రాయలసీమలో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని, పంట ఉత్పత్తుల నిల్వకు గోదాములు నిర్మిస్తామని, రాయలసీమను హార్టీకల్చర్ హబ్గా మారుస్తామని ప్రకటించారు.
దళిత రైతు రంగమ్మకు రూ.లక్ష సాయం
అప్పుల బాధ భరించలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని గోనెగండ్ల మండలం నెరుడుప్పలకు చెందిన దళిత రైతు రంగమ్మ లోకేశ్ వద్ద కన్నీరుమున్నీరయ్యారు. 12 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తే నష్టపోయామని, తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. లోకేశ్ అప్పటికప్పుడు ఆమెకు రూ.లక్ష సాయాన్ని ప్రకటించారు. తెదేపా అధికారంలోకి రాగానే మరో రూ.10 లక్షలు ఇస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇస్తానన్న జగన్ ఒక్కరికైనా పరిహారమిచ్చారా? అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు సీపీఐ(ఎం), కాంగ్రెస్లపై విమర్శలు గుప్పించారు. -
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ