Balineni Srinivasa Reddy: రాజీనామాపై తగ్గేది లేదు
వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త పదవికి తాను చేసిన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
పార్టీ పదవి విషయంలో సీఎం జగన్కు తేల్చిచెప్పిన బాలినేని
కొనసాగాలని ముఖ్యమంత్రి చెప్పినా కాదన్న మాజీ మంత్రి
ఈనాడు, అమరావతి: వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త పదవికి తాను చేసిన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ సర్దిచెప్పినా ఆయన ససేమిరా అన్నారు. ‘నియోజకవర్గంలో మీకేం కావాలో చెప్పండి.. పార్టీపరంగా, ప్రభుత్వపరంగా ఏ సహకారం కావాలి? రాజీనామాను ఉపసంహరించుకుని ప్రాంతీయ సమన్వయకర్తగా కొనసాగండి’ అని సీఎం చెప్పినా బాలినేని మెత్తబడలేదని తెలిసింది. ఆయన ముఖ్యమంత్రిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. 40 నిమిషాలకు పైగా కొనసాగిన ఈ భేటీలో రాజీనామా ఉపసంహరణ తప్ప ఇంకేదైనా చెప్పాలని బాలినేని అన్నట్లు సమాచారం. ‘ఒంగోలుపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలి. అనారోగ్యం వల్ల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతను నిర్వర్తించడం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నా నియోజకవర్గానికే పరిమితమవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని సీఎంకు కచ్చితంగా చెప్పినట్లు తెలిసింది.
ఇలా రాజీనామా చేస్తే పార్టీ కేడర్కు వేరే సంకేతాలు వెళ్తాయని.. రాజీనామాను ఉపసంహరించుకోవాలని సీఎం చెప్పినా బాలినేని తగ్గలేదని సమాచారం. వైకాపాకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐ-ప్యాక్ సంస్థ ప్రతినిధి రిషిరాజ్ క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో పార్టీలో ఉన్న గ్రూపులు, వాటిని సర్దుబాటు చేసేందుకు బాలినేని అవసరం ఎంత ఉందనే విషయంపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది. అయినా తాను మాత్రం ఒంగోలుకే పరిమితం కావాలని అనుకుంటున్నట్లు బాలినేని తెగేసి చెప్పారని సమాచారం.
ఇదేం అవమానం: సీఎం పిలుపుతో వచ్చిన బాలినేని.. తొలుత సీఎంఓలోని ఒక కీలక అధికారి, ఐ-ప్యాక్ ప్రతినిధితో మాట్లాడారు. ‘గతేడాది నన్ను మంత్రివర్గం నుంచి తప్పించినప్పుడు ఏం చెప్పారు? మంత్రివర్గంలో లేకపోయినా జిల్లాలో మీరే మంత్రి, మీకు ఆ గౌరవం ఉంటుందన్నారు. కానీ జరుగుతున్నదేంటి? కనీసం నేను అడిగిన డీఎస్పీని కూడా ఎందుకు ఇవ్వలేదు’ అని బాలినేని ప్రశ్నించినట్లు తెలిసింది. ‘ఇప్పుడు ఇచ్చిన డీఎస్పీ మీ మాట వింటారని సమాచారం ఉంది, అందుకే వేశాం’ అని ఆ అధికారి చెప్పగా.. ‘నేను అడిగిన వాళ్లను కాదని మీరు వేసిన వ్యక్తి నా మాట ఎలా వింటారు’ అని బాలినేని చికాకు పడినట్లు సమాచారం. తర్వాత వారు ఆయన్ను సీఎం వద్దకు తీసుకువెళ్లారు. ‘వాసన్నా.. కో ఆర్డినేటర్గా కంటిన్యూ కావాలి’ అని సీఎం అనగా, ‘లేదు, నేను ఉండలేను’ అని బాలినేని చెప్పారు. బాలినేని తిరిగి వెళ్లేటప్పుడు మీడియా పాయింట్ ఉన్న వైపు కాకుండా మరో దారిలో వెళ్లిపోయారు.
అప్పటినుంచి అసంతృప్తి: గతేడాది మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. మొదటి మంత్రివర్గంలో ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు నలుగురు ఉండేవారు. గౌతమ్రెడ్డి మృతిచెందగా, మిగిలిన ఇద్దరినీ కొనసాగించి తననే తప్పించారని బాలినేని అసహనంతోనే ఉంటున్నారు. తనను కాదని ప్రకాశం జిల్లాలో ఆదిమూలపు సురేష్ను కొనసాగించడం పుండుమీద కారం చల్లినట్లుగా మారింది. ఇటీవల ముఖ్యమంత్రి ఆ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు మంత్రి సురేష్ను ఆయన వద్దకు అనుమతించి, బాలినేనిని మాత్రం అధికారులు అనుమతించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దాన్ని తీవ్ర అవమానంగా భావించిన బాలినేని.. సీఎంను కలవకుండానే వెనుదిరిగి వెళ్లిపోగా, తర్వాత విషయం తెలిసి ఆయన్ను సీఎం పిలిపించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే బాలినేని పార్టీ పదవికి రాజీనామా చేశారంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?