Rahul Gandhi: బెంగళూరు వీధుల్లో రాహుల్ సందడి
కర్ణాటక విధానసభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఆదివారం రోడ్షో, ప్రచార సభలను కొనసాగించారు.
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే: కర్ణాటక విధానసభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఆదివారం రోడ్షో, ప్రచార సభలను కొనసాగించారు. భోజన విరామ సమయంలో ఎంజీ రోడ్డు సమీపంలోని ఎయిర్లైన్స్ హోటల్కు చేరుకున్నారు. ఆహారం, నిత్యావసరాలను అందజేసే వివిధ కంపెనీల డెలివరీ బాయ్లతో ఆయన మాట్లాడుతూ మసాలా దోసెను ఆరగించారు. కాఫీ తాగుతూ నిత్యావసరాల ధరల పెరుగుదలపై చర్చించారు. స్థిరమైన ఉపాధి లేకపోవడంతో తాము డెలివరీ బాయ్లుగా పనిచేస్తున్నామని పలువురు ఆయనకు వివరించారు. బెంగళూరులోనే సుమారు రెండు లక్షలకు పైగా డెలవరీ బాయ్లు ఉన్నారు. కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి కార్మికుల సంక్షేమానికి రూ.3 వేల కోట్ల నిధులను కేటాయిస్తామని రాహుల్ ఈ సందర్భంగా తెలిపారు. అసంఘటిత కార్మికులకు పనిగంటలు, కనీస వేతన చట్టాలకు అనుగుణంగా వేతనాలను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓ డెలివరీ బాయ్ ద్విచక్ర వాహనంపై హోటల్ సమీపంలోని వీధుల్లో కాసేపు తిరిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్