ఆ నాలుగు రాష్ట్రాలపై ప్రభావమెంత?
కర్ణాటక ఫలితాల వెల్లడితో అందరి దృష్టీ రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలవైపు మళ్లుతోంది. ఈ ఏడాది చివరిలోగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్గఢ్, తెలంగాణలపై దృష్టి
ఈనాడు, దిల్లీ: కర్ణాటక ఫలితాల వెల్లడితో అందరి దృష్టీ రాబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికలవైపు మళ్లుతోంది. ఈ ఏడాది చివరిలోగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మూడు ఉత్తరాది రాష్ట్రాలు కాగా, ఒకటి దక్షిణాది రాష్ట్రం. మొదటి మూడు రాష్ట్రాల్లో భాజపా సుదీర్ఘ పాలన సాగించగా, తెలంగాణలో తొలిసారి జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతోంది. వీటిపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఎలా ఉండొచ్చనేది ఆసక్తికరాంశం!
రాజస్థాన్: వసుంధరకు ఊతం?
కర్ణాటక ఫలితాలు భాజపా అగ్రనాయకత్వానికి నిరుత్సాహం కల్గించినా రాజస్థాన్ స్థానిక నేత వసుంధర రాజెకు మాత్రం కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటాయి. అంతా ఒకే పార్టీ నాయకులే అయినప్పటికీ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలన్న వైఖరి ఇక్కడ నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూ వస్తోంది. వసుంధర ఆధిపత్యాన్ని తగ్గించడానికి భాజపా నాయకత్వం నిరంతరం ఇతర నేతలను రాష్ట్రంలో ప్రోత్సహిస్తోంది. ఆమెను బలంగా వ్యతిరేకించే గజేంద్రసింగ్ షెకావత్కు కేంద్ర మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యామ్నాయ నేతగా తయారుచేసే పనిలో భాజపా అధిష్ఠానం ఉంది. అయితే కర్ణాటకలో బలమైన నాయకుడు యడియూరప్పను తప్పించి ఇతర నేతలకు పగ్గాలు అప్పగించడంవల్ల పార్టీ దెబ్బతిందన్న భావనను ప్రస్తుత ఫలితాలు కల్పించాయి. ఈ అనుభవం నేపథ్యంలో రాజస్థాన్లో ఇకమీదట వసుంధర రాజెను, ఆమె మాటను పెడచెవిన పెట్టడానికి భాజపా అధిష్ఠానం సాహసిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారడం ఆనవాయితీగా వస్తున్న రాజస్థాన్లో వచ్చే ఎన్నికల్లో భాజపా అధికారం చేజిక్కించుకోవడానికి చాలా అవకాశాలున్నాయి. కాంగ్రెస్ నేతలు అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ల మధ్య ఉన్న అంతర్గత పోరు అందుకు ఊతమిస్తోంది.
మధ్యప్రదేశ్: కమల్తో కమలం ఢీ?
ఇక్కడ భాజపా ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ నాయకత్వపరంగా బలంగా ఉన్నప్పటికీ 2005 నుంచి వరుసగా నాలుగోసారి (2018 డిసెంబర్ 17 నుంచి 2020 డిసెంబర్ 23 వరకు మినహా) ఆ పదవిలో కొనసాగుతుండటంతో సహజంగా ఎదురయ్యే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు అవినీతి ఆరోపణలూ ఉన్నాయి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా ఉమ్మడి నాయకత్వంలో వెళ్లడానికి ప్రయత్నించ వచ్చనే భావన భాజపా వర్గాల్లో వ్యక్తమవుతూ వస్తోంది. అయితే కర్ణాటక ఫలితం నేపథ్యంలో చౌహాన్లాంటి బలమైన నాయకుడిని పక్కనపెట్టే సాహసం భాజపా నాయకత్వం చేయకపోవచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. అలాచేస్తే బలమైన ఓబీసీ నేతను పక్కన పెట్టారన్న అపవాదునూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది భాజపాకు నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. అందువల్ల భాజపా అధిష్ఠానం దూకుడుగా కాకుండా కొంత ఆచితూచి అడుగులువేసే అవకాశాలు ఎక్కుగా కనిపిస్తున్నాయి. మరోవైపు కర్ణాటక ఫలితం మధ్యప్రదేశ్ కాంగ్రెస్కు ఉత్సాహాన్నిస్తుందనటంలో సందేహం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెలుచుకొని ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. ఇతరుల సహాయంతో కమల్నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కానీ 15 ఏళ్ల తర్వాత దక్కిన ఆ అధికారం జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో 15 నెలల్లోనే చేజారిపోయింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని భాజపా నాయకత్వం అప్రజ్వామికంగా కూల్చేసిందన్న సానుభూతితో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర ఇక్కడ బాగానే సాగింది. దాన్ని చూసి రాహుల్గాంధీ కూడా రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ప్రకటించారు. కర్ణాటక తరహాలో స్థానిక అంశాలను ఎత్తిచూపే వ్యూహాన్ని ఇక్కడా అమలుచేసి అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించొచ్చు. హిమాచల్, కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో స్థైర్యం నింపే అవకాశం ఉన్నందున రాబోయే ఎన్నికలను బలంగా ఎదుర్కొనేందుకు వీలుంటుంది.
ఛత్తీస్గఢ్: బఘేల్ మళ్లీ జిగేల్ అనేనా?
ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్థిరంగా ఉన్నారు. ఒకవైపు అధిష్ఠానానికి విశ్వాసంగా ఉంటూనే మరోవైపు స్థానికంగా పార్టీని బలంగా నిలబెట్టుకొని, ప్రాంతీయ పార్టీ నేత తరహాలో పని చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, రైతులపై దృష్టిపెట్టి పనిచేయడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ఫలితాలు ఇక్కడ పార్టీ నాయకత్వానికి మంచి ఊపునిచ్చాయనడంలో సందేహం లేదు. ఇటీవల ఛత్తీస్గడ్ భాజపా ముఖ్యనేత, ఎస్టీల్లో పేరెన్నికగన్న మాజీ ఎంపీ నందకుమార్సాయిని కాంగ్రెస్లోకి చేర్చుకున్నారు. తద్వారా ఎస్టీ సామాజికవర్గంలో పార్టీని బలంగా తీసుకొళ్లే వ్యూహం అమలు చేశారు. మరోవైపు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్సింగ్ను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించాలా వద్దా అనే సంశయంలో భాజపా ఉంది. ఎన్నికల ముందు భూపేష్ బఘేల్ను ఢీకొనే కొత్త నాయకత్వం తయారు చేసుకోవడం భాజపా నాయకత్వానికి పెద్ద సవాల్.
తెలంగాణ: దూకుడు పెరిగేనా?
కర్ణాటక ఫలితాలు తెలంగాణ భాజపాకు మింగుడుపడకున్నా భారాస, కాంగ్రెస్కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చేవే! తెలంగాణ ప్రాంత ప్రజలూ భాజపాను నమ్మరన్న ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ రెండు పార్టీలకు అవకాశం దొరికింది. తెలంగాణ భాజపా నేతలపై మానసికంగా పైచేయి సాధించి... దూకుడు పెంచడానికి భారాస, కాంగ్రెస్లకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది. ప్రశాంత్ కిశోర్ తరహాలో కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ కనుగోలు పనిచేసి ఆ పార్టీకి మంచి విజయం దక్కేలా చూశారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తగానూ ఆయనే వ్యవహరిస్తున్నందున ఆ అనుభవం ఇక్కడ ఎలా పనిచేస్తుందన్నది చూడాలి. అలాగే ఎన్నికల సందర్భంలో ప్రచారానికి అవసరమైన అన్ని రకాల వనరులూ సమకూర్చుకునే వెసులుబాటు కర్ణాటకలో విజయం ద్వారా కాంగ్రెస్కు లభిస్తుంది. మరోవైపు భారాస రాబోయే ఎన్నికల్లో భాజపాను ప్రధాన శత్రువుగా చూపుతూ దూకుడు ప్రదర్శిస్తోంది. కర్ణాటకలో భాజపా దారుణంగా దెబ్బతినడంవల్ల తెలంగాణలో భారాస మరింతగా దాడి చేసేందుకు ఆయుధం చిక్కినట్లయింది. తాము మద్దతు ఇచ్చిన జేడీ (ఎస్) కర్ణాటకలో పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ భాజపా ఓడిపోవడం తెలంగాణలో భారాసకు ఊరటనిచ్చే అంశమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!