Yuvagalam: ప్రజాభిమానానికి ‘వంద’నం
‘యువగళం’ పాదయాత్ర వందో రోజు నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో సోమవారం ఉత్సాహంగా సాగింది.
‘యువగళం’ వందో రోజు భారీగా హాజరైన జనం
తల్లి, కుటుంబీకులతో కలిసి నడిచిన లోకేశ్
గిరిజనులతో ముఖాముఖిలో పాల్గొన్న నేత
ఈనాడు, కర్నూలు: ‘యువగళం’ పాదయాత్ర వందో రోజు నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో సోమవారం ఉత్సాహంగా సాగింది. భారీగా హాజరైన జనసందోహం మధ్య తెదేపా యువ నేత నారా లోకేశ్ ఉత్సాహంగా నడిచారు. మాతృమూర్తి భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబీకులు ఆయనకు తోడుగా అడుగులేశారు. అభిమానగణంలో మరింత స్ఫూర్తినింపారు. వారిని చూసేందుకు వచ్చిన ప్రజలతో వీధులు కిక్కిరిశాయి. కొద్ది నిమిషాలపాటు ట్రాఫిక్ నిలిచింది. పాదయాత్రకు ప్రత్యేకమైన రోజు అయినందున మోతుకూరులో పైలాన్ను లోకేశ్ ఆవిష్కరించారు. ‘యువగళం’ విశేషాలతో తెదేపా నేత కేశినేని శివనాథ్ (చిన్ని) తీసుకొచ్చిన ప్రత్యేక సంచిక ‘జన హృదయమై నారా లోకేశ్’ను బోయరేవుల క్యాంపు సైట్ వద్ద లోకేశ్ అవిష్కరించారు. యాత్రలో భాగంగా సంతజూటూరులో ‘చెంచులతో ముఖాముఖి’లో పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే ఐటీడీఏలను ప్రక్షాళన చేస్తామని, దామాషా ప్రకారం నిధులు కేటాయించి గిరిజనులు, చెంచుల అభివృద్ధికి కృషి చేస్తామని లోకేశ్ హామీనిచ్చారు.
‘గిరిజనుల అభివృద్ధికి తెదేపా రూ.15వేల కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ప్రభుత్వం చెంచుల నిధులనూ కొట్టేసింది. చెంచులకున్న ప్రత్యేక అటవీ హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదు. తెదేపా అధికారంలోకి రాగానే ఐటీడీఏల నిధులతో వారి సంక్షేమ కార్యక్రమాలను చేపడతాం. మొదటి ఏడాదిలోనే చెంచు కుటుంబాలకు ఇళ్లు కట్టిస్తాం. ఎకోటూరిజం అభివృద్ధి చేస్తాం. వ్యవసాయ భూములకు నీరందేలా సౌర మోటార్లు ఏర్పాటుచేస్తాం. చెంచులకు బ్యాంకు రుణాలు ఇప్పించి స్వయంఉపాధికి అండగా నిలుస్తాం. గిరిజనుల ఉత్పత్తుల మార్కెటింగ్కు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా అవుట్లెట్లను ఏర్పాటుచేస్తాం’ అని పేర్కొన్నారు. అరకు పరిసర గిరిజనులకు ప్రయోజనకరంగా ఉండేలా అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ను తీసుకొచ్చామని గుర్తుచేశారు. పాదయాత్రలో మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, భూమా అఖిలప్రియ, పీతల సుజాత, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్రయాదవ్, బుడ్డా రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోకేశ్ వెంట నారా, నందమూరి కుటుంబాలవారు ఉత్సాహంగా నడిచారు. ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తెదేపా శ్రేణుల ఉత్సాహం
యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. వైయస్ఆర్ జిల్లా మైదుకూరులో తెదేపా సంఘీభావ పాదయాత్రకు మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ఆ దేవుడు కూడా కాపాడలేడని జగన్మోహన్రెడ్డికి కర్ణాటకలో భాజపాకు ఎదురైన పరిస్థితే వస్తుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. విజయనగరంలోని కోట కూడలి వద్ద తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. జైలుకెళ్లిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. జగన్మోహన్రెడ్డిని మళ్లీ అక్కడికే పంపించాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో తెదేపా పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వైకాపా నేతలు కొందరు తెదేపా కార్యకర్తల నుంచి జెండాలు లాక్కుని తిరిగి వారిపై రాళ్లదాడికి దిగారు.
మీ కుటుంబాలకు ఏమిచ్చినా రుణం తీరదు: భువనేశ్వరి
కుటుంబాలను వదిలిపెట్టి వచ్చి పాదయాత్రలో లోకేశ్కు అండగా నిలిచిన వాలంటీర్లకు, వారి కుటుంబసభ్యులకు ఏమిచ్చినా రుణం తీరదని భువనేశ్వరి పేర్కొన్నారు. ‘ఒక్క అడుగు వేయడమే మాకు చాలా కష్టంగా అనిపించింది. వాలంటీర్లు వంద రోజులుగా పాదయాత్రలో అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. లోకేశ్కు మంచి విజన్ ఉంది. అలాంటి వ్యక్తికి మీలాంటి గొప్ప వాలంటీర్ల బృందం దొరికింది. మరో మూడొందలు రోజులు కష్టపడదాం. మీ సేవలు ఇలాగే కొనసాగించండి. మీతో మేముంటాం’ అని కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వాలంటీర్లు అందరికీ ఆమె స్వయంగా భోజనాలు వడ్డించారు.
యువగళంతో లోకేశ్ ప్రజలకు దగ్గరయ్యారు: చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: లోకేశ్ యువగళం పాదయాత్ర సోమవారంతో వంద రోజుల మైలురాయిని చేరుకున్నందున తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ వంద రోజుల పాదయాత్రలో రోడ్డుపై లోకేశ్ గడిపిన సమయం ప్రజా సమస్యలు దగ్గర నుంచి చూడటానికి కచ్చితంగా ఉపయోగపడింది. లోకేశ్ను ప్రజలకు దగ్గర చేసింది. ఇంకా చాలా మైళ్లు ముందుకు సాగాలి’ అని చంద్రబాబు ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
కాకినాడ జిల్లా కొత్తపల్లిలో తెదేపా నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్ర మరో లేఖ రాశారు. సీఎంపై రాయి దాడి కేసులో బొండా ఉమాను ఇరికించేలా వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. -
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు