Ambati Rambabu: పవన్.. కూలీ నంబర్వన్.. ఆయన రాజకీయాలకు పనికిరాడు: మంత్రి అంబటి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కూలీ నంబర్ వన్ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
సత్తెనపల్లి, న్యూస్టుడే: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కూలీ నంబర్ వన్ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు అనర్హుడన్నారు. చంద్రబాబు సిగ్నల్ ఇస్తేనే వారాహి బయటకు వస్తుందా అని ప్రశ్నించారు. పవన్ ప్రచారానికి చంద్రబాబు అనుమతి కావాలన్నారు. చంద్రబాబు కోసమే పవన్ పార్టీ పెట్టాడని, జనసేన తగ్గడమేకానీ పెరిగేది లేదన్నారు. వందమంది చంద్రబాబులు, వెయ్యి మంది పవన్ కల్యాణ్లు అడ్డుపడినా రాజధాని ప్రాంతంలో ఇంటి పట్టాలు ఇచ్చి తీరుతామని మంత్రి చెప్పారు. ‘పేదలకు రాజధానిలో స్థానం ఇవ్వరా? 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల్లో 10 మందితో కోర్టులో కేసులు వేయించింది చంద్రబాబే. లోకేశ్ను ఓడించేందుకు మేము రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వట్లేదు’ అని అంబటి వివరించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని కంటెపూడిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాగలక్ష్మికి రూ.లక్ష నగదు, ట్రైసైకిల్ ఇస్తానని, పేద విద్యార్థిని లావణ్యను పూర్తిస్థాయిలో చదివిస్తానని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..