111 జీఓ రద్దు వెనుక భారీ కుంభకోణం
జీఓ 111 రద్దు వెనుక రూ.లక్షల కోట్ల కుంభకోణం దాగుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: జీఓ 111 రద్దు వెనుక రూ.లక్షల కోట్ల కుంభకోణం దాగుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ కుంభకోణంలో ఎంత దోపిడీ జరుగుతుందో లెక్కించాలంటే ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, కోదండరెడ్డి, షబ్బీర్ అలీ, బలరాం నాయక్, శోభారాణి, వినోద్ తదితరులతో కలసి సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ తీసుకున్న జీఓ రద్దు నిర్ణయంతో హైదరాబాద్ నగరం భవిష్యత్తులో వరదల్లో మునిగి, వేల మంది మృత్యువాత పడే భయానక పరిస్థితి వస్తుంది. ఈ జీఓ పరిధిలోని గ్రామాల్లో భారాస నేతలకు ఫాంహౌసులు ఉన్నాయి. 2019 తర్వాత వారంతా ఈ గ్రామాల్లో పేదల నుంచి తక్కువ ధరలకు పెద్ద ఎత్తున భూములను కొనేశారు. ఇప్పుడవి చాలావరకు కేసీఆర్ బంధుగణం, బినామీల చేతుల్లోకి వెళ్లాయి. ఈ తంతంగం ముగిసిన తర్వాత వారికి లబ్ధి చేకూర్చేందుకు జీఓను రద్దు చేశారు. భాజపాకు భారాస నుంచి వాటాలు అందుతుండటంతోనే కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ అవినీతిపై కేసులు పెట్టకుండా చోద్యం చూస్తోంది. ఈ వాటాలు అందకుంటే కేసీఆర్పై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బండి సంజయ్, కిషన్రెడ్డిలు చెప్పాలి. 111 జీఓ రద్దు అణు విస్ఫోటం లాంటిది. జపాన్లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబులు వేసినప్పుడు జరిగినంత నష్టంలాంటి విపత్తు ఈ జీఓ రద్దుతో హైదరాబాద్కు వాటిల్లే ప్రమాదముంది. ఈ రద్దు వెనుక సీనియర్ ఐఏఎస్ అధికారుల పాత్ర ఉంది. జీఓ రద్దు వ్యవహారంపై క్షేత్రస్థాయి విచారణకు కాంగ్రెస్ తరఫున నిజనిరార్ధణ కమిటీని వేస్తాం’’ అని రేవంత్రెడ్డి ప్రకటించారు.
11 ఎకరాలు కేటాయించుకున్నారు
కోకాపేటలో రూ.600 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని రూ.40 కోట్లకే ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ఎక్స్లెన్స్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్’ పేరిట భారాస కార్యాలయం కోసం కేసీఆర్ కేటాయించుకున్నారని రేవంత్రెడ్డి ఆరోపించారు. ‘‘గతంలో కాంగ్రెస్ హయాంలో బంజారాహిల్స్లో ఎకరా భూమిని అప్పటి తెరాస కార్యాలయం కోసం కేటాయించారు. అది సరిపోదన్నట్లు హైదరాబాద్ భారాస కార్యాలయం కోసమంటూ మరో ఎకరం భూమిని కేసీఆర్ తీసుకున్నా(రు. దీంతోపాటు 33 జిల్లాల్లో భారాస కార్యాలయాలకు వందల ఎకరాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో సొంత కార్యాలయం లేదు. గాంధీభవన్లో అద్దెకు ఉంటోంది. ఉమ్మడి రాష్ట్రంలో గాంధీభవన్ పక్కన హౌసింగ్ బోర్డు 5,100 చదరపు అడుగుల స్థలం కేటాయించగా దానిపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్కు ఆ స్థలం అవసరం లేదంటూ 2016లో కేసును ఉపసంహరించుకున్నారు. మరి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్కు భూమి ఇవ్వరా...?’’ అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
-
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది. -
రేవంత్ అధ్యక్షతన పీఈసీ సమావేశం నేడు
కాంగ్రెస్ ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(పీఈసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై కేసు
ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు బుధవారం చెంగిచర్ల వెళ్లిన ఎంపీ బండి సంజయ్పై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ జరిపించాలి: లక్ష్మణ్
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి