Nara Lokesh: రాయలసీమపై కార్యాచరణ ప్రణాళిక
‘రాయలసీమలో మూడు ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశా. రైతుల కష్టాలను తెలుసుకున్నా. వైయస్ఆర్ జిల్లాలోనూ పాదయాత్ర పూర్తి చేసి సమగ్ర అవగాహనతో సీమ రైతులకు పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టే కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి నెల్లూరు జిల్లాలోకి అడుగుపెడతాను...’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లోకేశ్ వెల్లడించారు.
ఇక్కడి నుంచి వెళ్లేలోగా ప్రకటిస్తా
సీఎం జగన్ సొంత జిల్లాలో పనులు కావడం లేదంటే ఆలోచించండి
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
కడప గడ్డపై గ్రామగ్రామాన ఘన స్వాగతం
ఈనాడు డిజిటల్, కడప: ‘రాయలసీమలో మూడు ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేశా. రైతుల కష్టాలను తెలుసుకున్నా. వైయస్ఆర్ జిల్లాలోనూ పాదయాత్ర పూర్తి చేసి సమగ్ర అవగాహనతో సీమ రైతులకు పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టే కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక ప్రకటించి నెల్లూరు జిల్లాలోకి అడుగుపెడతాను...’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లోకేశ్ వెల్లడించారు. వైయస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలం సుద్దపల్లె వద్ద గండికోట, రాజోలి జలాశయాల ముంపు బాధితులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పాదయాత్ర చేపట్టి 1,400 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా నెమళ్లదిన్నె గ్రామంలో శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. గండికోట నిర్వాసితులకు ఉపాధి కల్పించడంలో భాగంగా చిన్నతరహా పరిశ్రమ ఏర్పాటుకు హామీ ఇస్తూ శిలాఫలకంపై రాయించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ‘108 రోజులుగా సీమలో పాదయాత్ర నిర్వహిస్తున్నా. ఎక్కడా రైతు లేని రాజ్యం కనిపిస్తోంది. నంద్యాలలో నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నామని అక్కడి రైతులు చెబితే.. కాదు అన్నదాతల తప్పిదాలతోనే పంట దిగుబడి రాలేదని ఎంపీ నివేదిక తయారు చేయించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించలేదు. పోలవరం, గండికోట, రాజోలి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం అందించడం లేదు...’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తియ్యని మాటలు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. ‘2014లో జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేని గెలిపిస్తే రహదారులు, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాం. పులివెందులకు సాగునీరందించాం. 2019లో అన్ని స్థానాల్లో వైకాపాను గెలిపించారు. మీ జీవితాలు మారాయా?. సీఎం సొంత జిల్లాలో పనులు కావడం లేదంటే ఆలోచించండి. తెదేపా అధికారంలోకి రాగానే న్యాయబద్ధమైన పరిహారం రైతులకు అందిస్తాం. పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం...’అని లోకేశ్ హామీ ఇచ్చారు. రాయలసీమ జిల్లాల్లో 1000 ట్రాక్టర్లకు రైతులు రుణం చెల్లించలేక జప్తు చేసే పరిస్థితి వచ్చిందని తనను కలిసిన బ్యాంకు అధికారి ఒకరు చెప్పారన్నారు. ‘మా ప్రాంతంలో శనగ పంట ఎక్కువగా పండిస్తాం. క్వింటాకు రూ.6,500 మద్ధతు ధరతో పంట కొనుగోలు చేస్తామని జగన్ గతంలో హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర లేక మూడేళ్లుగా పంటను గోదాముల్లో దాచుకున్నాం. చాలా మంది రైతులు అప్పులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు...’ అని పెద్ద పసుపుల రైతు పుల్లారెడ్డి వివరించారు. సుద్దపల్లె నుంచి పాదయాత్ర ప్రారంభించగా జంగాలపల్లె, జె.కొట్టాలపల్లె, ఉప్పలూరు, నెమళ్లదిన్నె మీదుగా ఎస్.కొత్తపల్లెకి చేరుకుంది. ఆయా గ్రామాల్లో మహిళలు లోకేశ్కు ఎదురేగి హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలను ప్రస్తావించడంతో పాటు వినతిపత్రాలు అందజేశారు. సీఎం జగన్ ఇలాకా వైయస్ఆర్ జిల్లాలో లోకేశ్కు గ్రామగ్రామాన ఘన స్వాగతం లభించింది. గంటల తరబడి నిరీక్షించి సంఘీభావం తెలిపారు.
నాలుగు రోజులపాటు పాదయాత్రకు విరామం
మహానాడు నేపథ్యంలో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు పాదయాత్రకు నారా లోకేశ్ విరామం ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం ఉదయమే పాదయాత్ర ప్రారంభించి మధ్యాహ్నానికి ముగించిన అనంతరం బయలుదేరి వెళ్లనున్నారు. తిరిగి ఈనెల 30వ తేదీన ప్రారంభించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్