YSRCP: ‘రోడ్డు వేయిస్తా.. తెదేపా జెండా కనపడకూడదు’!

‘అన్నమయ్య జిల్లా పీలేరు మండలం జాండ్ల పంచాయతీ బసిరెడ్డిగారిపల్లెకు రోడ్డు వేయిస్తా... తెదేపా జెండా కనిపించకూడదు’ అని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.

Updated : 26 May 2023 08:48 IST

పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి

పీలేరు, న్యూస్‌టుడే: ‘అన్నమయ్య జిల్లా పీలేరు మండలం జాండ్ల పంచాయతీ బసిరెడ్డిగారిపల్లెకు రోడ్డు వేయిస్తా... తెదేపా జెండా కనిపించకూడదు’ అని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. ‘గడప గడపకు’ కార్యక్రమంలో భాగంగా పీలేరు మండలం జాండ్ల పంచాయతీలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కొంతమంది గ్రామస్థులు బసిరెడ్డిగారిపల్లెకు తలపుల బస్సు మార్గం నుంచి తారురోడ్డు వేయాలని కోరగా ఎమ్మెల్యే ఈ విధంగా స్పందించారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైకాపాను గెలిపిస్తే వారికి భవిష్యత్తు ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని