మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం
రాజమహేంద్రవరం వేదికగా జరగబోయే మహానాడు నుంచి తెదేపా ఎన్నికల శంఖారావం పూరించనుంది. మరో ఏడాది లోపే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఎన్నికల సమరానికి సన్నద్ధం చేయనుంది.
రాజమహేంద్రవరం వేదికగా పసుపు పండగకు ఏర్పాట్లు పూర్తి
నేడు ప్రతినిధుల సభ, రేపు బహిరంగ సభ
(వేమగిరిలోని మహానాడు ప్రాంగణం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి)
రాజమహేంద్రవరం వేదికగా జరగబోయే మహానాడు నుంచి తెదేపా ఎన్నికల శంఖారావం పూరించనుంది. మరో ఏడాది లోపే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేసి ఎన్నికల సమరానికి సన్నద్ధం చేయనుంది. ప్రధాన ప్రతిపక్షంగా నాలుగేళ్లుగా వైకాపాపై చేస్తున్న పోరాటాలను సమీక్షించుకుని.. ఈ ఎన్నికల ఏడాదిలో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణను రూపొందించుకోనుంది. ప్రస్తుతమున్న దారుణ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటం ఎంతటి చారిత్రక అవసరమో ప్రజలకు వివరించనుంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి వద్ద శని, ఆదివారాల్లో పసుపు పండగకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం కావటం, తెదేపా స్థాపించి 41 ఏళ్లు పూర్తవ్వటంతో చరిత్రలో నిలిచిపోయేలా మహానాడుకు సర్వం సిద్ధం చేశారు.
నేడు 15వేల మందితో ప్రతినిధుల సభ
తొలిరోజైన శనివారం ప్రతినిధుల సభ కోసం 10 ఎకరాల్లో ప్రాంగణాలు, వేదికలు సిద్ధం చేశారు. 15వేల మంది పార్టీ ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించారు. మరో 35వేల మంది కార్యకర్తలు వస్తారని అంచనా. ఎండ తగలకుండా సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. కూలర్లు ఏర్పాటు చేశారు. దూరంగా కూర్చున్నవారికీ సభావేదిక కనిపించేలా 20 ఎల్ఈడీ తెరలు ఏర్పాటుచేశారు. ఆదివారం సాయంత్రం 15 లక్షలమందితో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు 60 ఎకరాల విస్తీర్ణంలో మరోచోట ఏర్పాట్లుచేశారు.
ఎన్టీఆర్, కాటన్, అల్లూరి సీతారామరాజు పేర్లు
చంద్రబాబు, లోకేశ్ సహా పార్టీ ముఖ్యనేతలు కూర్చునేందుకు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సభా వేదిక నిర్మించారు. ప్రతినిధులు, అతిథులు ఈ వేదికపైకి చేరేందుకు మూడు ప్రధానద్వారాలు ఏర్పాటుచేశారు. మొదటిద్వారం ఎన్టీఆర్ మార్గ్ గుండా ప్రతినిధులు లోపలికి వచ్చి లోక్సభ నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన స్టాళ్లవద్ద వివరాలు నమోదు చేసుకుంటారు. మధ్యలో కాటన్ మార్గం ద్వారా ఇతర ప్రతినిధుల రాకపోకలు ఉంటాయి. చంద్రబాబు, లోకేశ్ సహా ఇతర ముఖ్యనాయకుల కోసం అల్లూరి సీతారామరాజు మార్గ్ను సిద్ధం చేశారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు
హాజరయ్యే ప్రతినిధుల వివరాలను ఈసారి డిజిటల్ విధానంలో నమోదుచేయనున్నారు. తెదేపా సభ్యత్వ కార్డులు, మహానాడు పాస్లు, ఆహ్వానపత్రాలపై క్యూఆర్ కోడ్లు ముద్రించారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా ఏర్పాటుచేసిన శిబిరాల్లోకి ప్రతినిధులు వెళ్లి వారి సభ్యత్వ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. వెంటనే సర్వర్లో ఆ ప్రతినిధి వివరాలు నమోదవుతాయి.
రేపు 15 లక్షల మందితో భారీ సభ
ఆదివారం సాయంత్రం 15 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికోసం 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. సభా ప్రాంగణాన్ని 24 గ్యాలరీలుగా విభజించారు. వేదికపైన ఉన్నవారిని దూరం నుంచి చూసేందుకు 50 ఎల్ఈడీ తెరలు ఏర్పాటుచేశారు. వేదిక చివరివైపు రక్తదాన, వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. వేదిక చుట్టుపక్కల అత్యవసర ద్వారాలున్నాయి. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఉదయం రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తారు. అనంతరం ప్రతినిధుల సభ వద్ద ఉన్న బసకు చేరుకుంటారు. సాయంత్రం మహానాడు బహిరంగ సభకు వెళ్తారు.
50 వేల మందికి బస..
మహానాడుకు వచ్చే ముఖ్యఅతిథులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులకు ప్రాధాన్యక్రమంలో గదులు కేటాయించి సుమారు 50 వేలమందికి వివిధ ప్రాంతాల్లో వసతి కల్పించారు. 32మంది పొలిట్బ్యూరో సభ్యులకు తొలి ప్రాధాన్యమిచ్చారు. తర్వాత మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, నియోజకవర్గాల బాధ్యులకు సుమారు 300, ఎన్ఆర్ఐలు 200 మందికి ప్రాధాన్యం కల్పించారు. తెదేపా అనుబంధ విభాగాల నాయకులకు అవకాశం ఉన్నమేరకు వసతి కల్పించారు. వంటకాలు సిద్ధం చేసేందుకు సుమారు 1,500 మంది రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా వంటకాలు సిద్ధం చేయనున్నారు.
ప్రాంగణంలోనే చంద్రబాబు, లోకేశ్ బస
మహానాడుకు వచ్చే ప్రతినిధులు, కార్యకర్తలు బస చేయడానికి వివిధ హోటళ్లు, ఇతరచోట్ల ఏర్పాట్లు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాత్రం మహానాడు ప్రాంగణంలోనే బస్సులో బస చేయనున్నారు. శుక్రవారం సాయంత్రమే వారు రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. మహానాడు ముగిసేవరకూ వారు ఆ ప్రాంగణంలోనే బసచేస్తారు.
తెదేపాకు రూ.కోటి విరాళం
కె.కోటపాడు, న్యూస్టుడే: తెదేపా కార్యకర్తల సంక్షేమ నిధికి అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గానికి చెందిన నాయకుడు పైలా ప్రసాదరావు రూ.కోటి చెక్కును పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు గురువారం రాత్రి అమరావతిలో అందజేశారు. చెక్కుతో జ్ఞాపిక ఇచ్చినట్లు ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
రూ.27 లక్షల చెక్కు అందజేత
పట్టాభిపురం(గుంటూరు), న్యూస్టుడే: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి కోవెలమూడి రవీంద్ర రూ.27 లక్షల చెక్కును చంద్రబాబుకు ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం అందజేశారు. గతేడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు రూ.27 లక్షలు అందజేసినట్లు కోవెలమూడి తెలిపారు.
మహానాడు వేదిక నుంచే మేనిఫెస్టో
2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం 2020, 2021 సంవత్సరాల్లో కొవిడ్ కారణంగా జూమ్ ద్వారా మహానాడు నిర్వహించారు. ఆ తర్వాత గతేడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు అపూర్వ స్పందన లభించింది. ఆ వేడుక విజయవంతం కావటం పార్టీకి గొప్ప ఊపు తీసుకొచ్చింది. అప్పటితో పోలిస్తే రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరుగుతోంది. తెదేపాకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం మోగించనుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయఢంకా మోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఎన్నడూలేని విధంగా ఈసారి మహానాడులోనే పార్టీ ఎన్నికల ప్రణాళిక (తొలి మేనిఫెస్టో)ను ప్రకటించనుంది. మహిళలు, యవకులు, రైతులకు అధిక ప్రయోజనం కలిగే అంశాలతో ఈ తొలి మేనిఫెస్టో విడుదల చేయనుంది.
ఆంధ్రప్రదేశ్వి 15... తెలంగాణవి 6 తీర్మానాలు
తొలిరోజైన శనివారం ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేశాక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు, సహజవనరుల దోపిడీ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం, తెదేపా ప్రభుత్వ హయాంలో అమలుచేసిన సంక్షేమపథకాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిన తీరు, జగన్ ప్రభుత్వం నమోదు చేస్తున్న అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, ధరల పెరుగుదల, పన్నులు, ఛార్జీల బాదుడు తదితర 15 అంశాలపై సభలో తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించనున్నారు. తెలంగాణవి ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
-
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత