మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకే తిరిగి భారాసలోకి

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకే తిరిగి భారాసలోకి వస్తున్నట్లు వనపర్తి జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 28 May 2023 04:37 IST

వనపర్తి జడ్పీ ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి 

వనపర్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి పనిచేసేందుకే తిరిగి భారాసలోకి వస్తున్నట్లు వనపర్తి జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం జడ్పీ ఛైర్మన్‌ ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. నిరంజన్‌రెడ్డికి తనకు మధ్య ఏర్పడిన అంతరం వల్ల.. మనస్తాపానికిలోనై భారాసకు రాజీనామా చేశానన్నారు. రెండు నెలలుగా తటస్థంగా ఉన్నానని.. ఆ సమయంలో ప్రజాక్షేత్రంలో సర్వే చేయించుకుని ప్రజల కోరిక మేరకు భారాసలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కొత్త జిల్లాల ఆవిర్భావం తరువాత వనపర్తి జిల్లా పరిషత్తు మొదటి ఛైర్మన్‌గా మంత్రి నిరంజన్‌రెడ్డి సహకారంతో అభివృద్ధిపథంలో తీసుకెళ్తానన్నారు. ఆదర్శ పాలకవర్గంగా నిలబెడదామంటూ సహచర జడ్పీటీసీ సభ్యులు చేసిన సూచన మేరకు పార్టీలోకి వచ్చానన్నారు. రాజీనామా తరువాత ఏ పార్టీలోనూ చేరలేదని, ఏనాడూ పార్టీని గాని, నిరంజన్‌రెడ్డిని గానీ విమర్శించలేదని పేర్కొన్నారు. సమావేశంలో పురపాలక సంఘం ఉపాధ్యక్షుడు వాకిటి శ్రీధర్‌, వనపర్తి మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రమేశ్‌గౌడ్‌, భారాస నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని