అబద్ధాలతో 9 ఏళ్లుగా భాజపా దోపిడీ: కన్నయ్యకుమార్‌

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా అబద్ధాలతో దోపిడీ చేస్తోందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి కన్నయ్యకుమార్‌ ఆరోపించారు.

Published : 28 May 2023 04:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తొమ్మిదేళ్లుగా అబద్ధాలతో దోపిడీ చేస్తోందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి కన్నయ్యకుమార్‌ ఆరోపించారు. పార్టీ సీనియర్‌ నేతలు నదీమ్‌ జావిద్‌, వీహెచ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌లతో కలసి శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. మోదీ పాలనపై ఏఐసీసీ ప్రచురించిన 9 సంవత్సరాల్లో 9 సవాళ్లు (నౌ సాల్‌, నౌ సవాల్‌)అనే పుస్తకాన్ని కన్నయ్యకుమార్‌ విడుదల చేశారు. ఆయన గతంలో ఇచ్చిన హామీల నుంచే ఈ 9 సవాళ్లను విసురుతున్నామని తెలిపారు. తమకు అధికారమిస్తే 100 రోజుల్లో నల్లధనం బయటికి తీస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామని, 100 స్మార్ట్‌ సిటీలు నిర్మిస్తామని 2014 ఎన్నికలకు ముందు మోదీ చెప్పారన్నారు. తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. అదానీ అభివృద్ధే దేశప్రగతి అనుకుంటున్నారని, ఆయన షెల్‌ కంపెనీల్లో పెట్టుబడులు ఎవరివో ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్య సాధనలో కేంద్రం విఫలమైందన్నారు. తాను ఓబీసీనని చెప్పుకొంటున్న మోదీ కులగణన చేయించడానికి ఎందుకు ఒప్పుకోవడంలేదని కన్నయ్యకుమార్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు