అడ్డొచ్చేవారిని తరిమికొట్టాలి
‘ఏపీలో తెదేపా అధికారంలోకి వచ్చినట్లే. మెజారిటీ ఎంతనేదే చూసుకోవాలి. తెలంగాణలోనూ పార్టీ సత్తాను చాటుతాం. ఇప్పుడు పార్టీలోకి పెద్దసంఖ్యలో యువతరం వచ్చారు.
తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
‘ఏపీలో తెదేపా అధికారంలోకి వచ్చినట్లే. మెజారిటీ ఎంతనేదే చూసుకోవాలి. తెలంగాణలోనూ పార్టీ సత్తాను చాటుతాం. ఇప్పుడు పార్టీలోకి పెద్దసంఖ్యలో యువతరం వచ్చారు. వారంతా మన అధినేత చంద్రబాబుకు అండగా నిలవాలి. ఆయనకు అడ్డొచ్చే వారిని తరిమికొట్టాలి’ అని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. మహానాడులో ఆయన మాట్లాడారు. ‘ఇటీవల తెలంగాణలో ఇంటింటా తెదేపా కార్యక్రమం, 17 పార్లమెంట్ స్థానాల పరిధిలో మినీ మహానాడు నిర్వహించాం. చంద్రబాబు విజన్ 2020ని తామే అమలు చేసినట్లుగా చెప్పుకొంటూ ఇప్పటి నేతలు కొబ్బరి కాయలు కొడుతున్నారని ఈ సందర్భంగా యువత తెలుసుకొని నిర్ఘాంతపోయారు. చంద్రబాబు దూరదృష్టితోనే ఇప్పుడు తాము ఐటీ రంగంలో రూ.లక్షలు సంపాదిస్తున్నట్లు యువత చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పటికీ ఏ ఇంటిని తట్టినా ఎన్టీఆర్, చంద్రబాబు జ్ఞాపకాలు ఉంటాయి’ అని జ్ఞానేశ్వర్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం