పేదోళ్లను ధనికులను చేస్తా..
‘నాలుగేళ్ల జగన్ పాలనలో రూ.2.50 లక్షల కోట్ల దోపిడీ జరిగింది. సీబీఐ ఛార్జిషీటు వేసిన మొత్తమే రూ.43వేల కోట్లు. ఎమ్మెల్యేల దోపిడీ అదనం. ఇదంతా కక్కిస్తాం.
జగన్ పాలనలో రూ.2.5 లక్షల కోట్ల దోపిడీ
ఎవడు అడ్డమొచ్చినా సైకిల్తో తొక్కుకొని పోతాం
దోపిడీ దొంగల్లారా.. ఖబడ్దార్.. మీ గుండెల్లో నిద్రపోతాం
విరుచుకుపడిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
(రాజమహేంద్రవరం నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి)
‘నాలుగేళ్ల జగన్ పాలనలో రూ.2.50 లక్షల కోట్ల దోపిడీ జరిగింది. సీబీఐ ఛార్జిషీటు వేసిన మొత్తమే రూ.43వేల కోట్లు. ఎమ్మెల్యేల దోపిడీ అదనం. ఇదంతా కక్కిస్తాం. అవసరమైన విచారణలు వేయించి, తిన్న ప్రతిపైసా.. పేదవాడికి ఇచ్చే బాధ్యత తెదేపాది. పేదోళ్లను ధనికులను చేసి చూపిస్తా. ఇది పేదలు, పెత్తందారుల యుద్ధం కాదు. పేదలను ధనికులు చేసే (పూర్ టు రిచ్) యుద్ధం. ఇదే తెదేపా సంకల్పం. రాజమహేంద్రవరం నుంచి ఈరోజే ప్రారంభిస్తున్నాం. ఎవడు అడ్డొచ్చినా సైకిల్తో తొక్కుకొని పోతాం’ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు వేమగిరి వద్ద శనివారం ప్రారంభమైన తెదేపా మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. ‘సహజవనరుల దోపిడీ- ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజా, రెడ్శాండల్ మాఫియా’ తీర్మానాన్ని ఆమోదించే ముందు చంద్రబాబు మాట్లాడారు. ‘తండ్రిని అడ్డంపెట్టుకుని జగన్ సంపాదించిన రూ.43 వేల కోట్లు స్వాధీనం చేసుకుంటే, బూత్కొకరు కోటీశ్వరుడు అవుతారు. సీఎంగా దోచుకున్న రూ.2.5 లక్షల కోట్లు ఇస్తే రాష్ట్రంలో ఎంతమంది కోటీశ్వరులు అవుతారో? ఈ కొత్త బిచ్చగాడు తాజాగా క్యాస్ట్వార్ అంటున్నాడు. అది క్యాష్ వార్. దోపిడీ దొంగల్లారా ఖబడ్దార్. మీ గుండెల్లో నిద్రపోతాం’ అని హెచ్చరించారు.
మహిళా శక్తిని గుర్తించింది తెదేపాయే
రాష్ట్రంలోని మహిళలను మహాశక్తిగా తయారుచేసే కార్యక్రమాన్ని రూపొందించనున్నామని చంద్రబాబునాయుడు తెలిపారు. మహిళా శక్తిని గుర్తించింది.. నాయకత్వాన్ని పెంచింది తెదేపాయేనని తెలిపారు. ‘మహిళా సంక్షేమంలో కోతలు- అడ్డూ అదుపులేని అత్యాచారాలు, హత్యలు’ అంశంపై చేసిన తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఆదివారం నిర్వహించే ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల్లో మహిళలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం’ అని చంద్రబాబు వివరించారు.
వెనుకబడిన వర్గాల రక్షణకు ప్రత్యేక చట్టం
‘వెనుకబడిన వర్గాల రక్షణకు శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే బాధ్యతను తెదేపా తీసుకుంటుంది’ అని చంద్రబాబు ప్రకటించారు. ‘తెదేపా హయాంలోని అయిదేళ్లలో బీసీలకు ఎంత ఖర్చు పెట్టాం? ఇప్పుడు నాలుగేళ్లలో వైకాపా ఎంత ఖర్చు పెట్టిందనే దానిపై కులాలవారీగా చర్చించేందుకు తెదేపా సిద్ధం’ అని సవాలు చేశారు. ‘బీసీల ద్రోహి జగన్ రెడి’్డ అనే తీర్మానాన్ని మహానాడులో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ప్రవేశపెట్టగా తీర్మానంపై చంద్రబాబు మాట్లాడారు.
ముస్లింల ఆస్తుల పరిరక్షణకు..
‘ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కొనసాగేలా చూసే బాధ్యత తెదేపా తీసుకుంటుంది’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. మైనారిటీల సంక్షేమంపై మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానంపై మాట్లాడుతూ... ‘ముస్లిం సంస్థల ఆస్తులపై దాడులు జరక్కుండా ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. వక్ఫ్బోర్డు ఆస్తులను సంరక్షించి, ఆదాయం పెరిగేలా చేస్తాం. పెరిగిన ఆదాయాన్ని మైనారిటీ సంక్షేమానికి వినియోగిస్తాం’ అని హామీ ఇచ్చారు.
రాబోయే ఎన్నికల్లో యువతకు 40% సీట్లు
రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. సమాజాన్ని మార్చే శక్తి ఉన్న యువత, మహిళలు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. మహానాడులో ‘యువత సంక్షేమం.. యువగళం’పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన ఆమోదించి మాట్లాడారు. ‘రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు రావాలంటే తెదేపాతోనే సాధ్యం. తెదేపాకు మద్దతుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా యువత ముందుకు రావాలి. ఏపీ, తెలంగాణల్లోని యువతను గ్లోబల్ ఎకానమీకి అనుసంధానిస్తాం. ప్రపంచంలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుని యువతను శక్తిమంతంగా తయారు చేస్తాం’ అని చెప్పారు.
ఆదివాసీలకు ప్రత్యేక కార్యక్రమం
ఆదివాసీలకు ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చే బాధ్యతను తెదేపా తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంలో ఎస్టీలకు జరుగుతున్న అన్యాయం, ఎస్టీల ద్రోహి జగన్ రెడ్డి అనే తీర్మానాన్ని మహానాడులో తెదేపా పొలిట్బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ప్రవేశపెట్టారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ..‘మొన్న ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాలన్నింటిలోనూ అతన్నే(జగన్ను ఉద్దేశించి) గెలిపించారు. తర్వాత ఆ సైకో గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు’ అని విమర్శించారు.
తెదేపా జాతీయ అధ్యక్షుడిగా 14వ సారి చంద్రబాబు ఎన్నిక
తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు వరుసగా 14వ సారి ఎన్నికయ్యారు. మహానాడులో శనివారం తెదేపా అధ్యక్ష ఎన్నికను నిర్వహించారు. వివరాలను ఎన్నికల నిర్వహణ కమిటీ తరఫున కాలవ శ్రీనివాసులు రాత్రి ప్రకటించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 11 నామినేషన్లు... అవి కూడా చంద్రబాబును బలపరుస్తూ వచ్చాయని తెలిపారు. అందువల్ల చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని శ్రీనివాసులు ప్రకటించారు. తర్వాత ఎన్నికల కమిటీ తరఫున డిక్లరేషన్ పత్రాన్ని చంద్రబాబుకు అప్పగించారు.
రాష్ట్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తా
‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా రాగద్వేషాలకు తావులేకుండా, కులమత ప్రాంతీయతలకు అతీతంగా.. నాకు అప్పగించిన విధులను మనసా వాచా కర్మణా నీతిమంతంగా, సమర్థంగా నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెదేపా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ప్రజల అభీష్టం మేరకు శాయశక్తులా కృషిచేస్తానని, పార్టీ పటిష్ఠత పెంచడానికి, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్రంలోని అన్నివర్గాల అభ్యున్నతికి.. విజ్ఞానవంతమైన, ఆదర్శవంతమైన, సంతోషకరమైన, ఆర్థిక అసమానతలు లేని, సుసంపన్నమైన సమాజ స్థాపనకు వెనకబడిన ప్రాంతాల, రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అంటూ తెదేపా జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్