ప్రతిపక్షాల విమర్శలు అర్థరహితం
ప్రపంచ ప్రముఖుల అభినందనలు సైతం అందుకుంటున్న ప్రధాని మోదీ నూతన పార్లమెంటును ప్రారంభిస్తే ప్రతిపక్షాలు విమర్శించడం అర్థరహితమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్టుడే: ప్రపంచ ప్రముఖుల అభినందనలు సైతం అందుకుంటున్న ప్రధాని మోదీ నూతన పార్లమెంటును ప్రారంభిస్తే ప్రతిపక్షాలు విమర్శించడం అర్థరహితమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. స్థానిక జిల్లాపరిషత్ దరి రాజస్థానీ సాంస్కృతిక్ మండలిలో ఆదివారం జరిగిన ప్రధాని ‘మన్ కీ బాత్’లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ నూతన పార్లమెంటు భవనం ప్రారంభిస్తే కేసీఆర్, మమతా బెనర్జీలాంటి వారు విమర్శించడమేంటని ప్రశ్నించారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి నూతన పార్లమెంటు భవనం ప్రారంభించకూడదా? అని ప్రశ్నించారు. ‘మన్ కీ బాత్’లో ప్రధాని నరేంద్రమోదీ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం ఆనందదాయకమన్నారు. త్వరలో కర్నూలులో పెద్దఎత్తున బీసీ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా భాజపాలో చేరిన పలువురికి పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసినీ ఆనంద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.