పార్లమెంటు కొత్త భవనంపై ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్
పార్లమెంటు కొత్త భవన త్రికోణ ఆకృతిని ఒక శవపేటికతో పోల్చుతూ ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్ చేసింది. దీనిపై భాజపా మండిపడింది.
మండిపడ్డ భాజపా
దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్
దిల్లీ, పట్నా: పార్లమెంటు కొత్త భవన త్రికోణ ఆకృతిని ఒక శవపేటికతో పోల్చుతూ ఆర్జేడీ వివాదాస్పద ట్వీట్ చేసింది. దీనిపై భాజపా మండిపడింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు ఇలాంటి శవపేటికలోనే ఖననం చేస్తారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆర్జేడీ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలని భాజపా నాయకుడు సుశీల్ మోదీ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఆర్జేడీ ఈ ట్వీట్ చేసింది. ఒక శవపేటిక చిత్రాన్ని, కొత్త భవన ఫొటోను పక్కపక్కన పెడుతూ.. ‘ఇదేమిటీ’ అనే ప్రశ్నను సంధించింది. దీనికి భాజపా బిహార్ శాఖ స్పందించింది. ‘‘ఈ ట్వీట్లో మొదటి చిత్రం (శవపేటిక).. మీ భవిష్యత్. రెండోది (పార్లమెంటు).. భారత భవిష్యత్. అర్థమైందా?’’ అని బదులిచ్చింది. ఆర్జేడీ తన ట్వీట్ను సమర్థించుకుంది. ‘‘పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించిన తీరును చూస్తే ప్రజాస్వామ్యాన్ని ఖననం చేశారన్న అభిప్రాయం కలుగుతోంది. అందుకే శవపేటిక ఫొటోను ఉంచాం. ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని కానీ, ఉపరాష్ట్రపతిని కానీ ఆహ్వానించలేదు. ప్రజాస్వామ్యంలో ఇలా జరగదు’’ అని ఆ పార్టీ బిహార్ విభాగం అధ్యక్షుడు మృత్యుంజయ్ తివారి పేర్కొన్నారు.
తీవ్ర అవమానం: వీహెచ్పీ
పార్లమెంటు కొత్త భవనాన్ని శవపేటికతో ఆర్జేడీ పోల్చడం.. ప్రజాస్వామ్య దేవాలయానికి పెద్ద అవమానమని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) దుయ్యబట్టింది. ఇది ప్రజా విశ్వాసంపై జరిగిన తీవ్ర దాడి అని వీహెచ్పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ